Manipur: మరింత మందిని సైన్యంలోకి పంపిస్తాం.. జవాన్ తండ్రి భావోద్వేగం

తీవ్రవాదుల ఆకస్మిక దాడిలో అమరుడైన జవాన్ భౌతిక కాయం ఎదుట.. అతడి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు.

Published : 18 Nov 2021 23:55 IST

ఇంఫాల్‌: ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో అమరుడైన జవాన్ భౌతిక కాయం ఎదుట.. అతడి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన కుమారుడి పట్ల గర్వంగా ఉందని రైఫిల్‌మెన్ ఖాట్నే కోన్యాక్ తండ్రి పేర్కొన్నారు. తమ తెగ నుంచి మరింత మందిని సైన్యంలోకి పంపిస్తామని గద్గద స్వరంతో అన్నారు. అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు శనివారం దాడి చేయగా.. కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు మరో ఐదుగురు సిబ్బంది చనిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని