ఆరోజు ట్రంప్ చెప్పింది అబద్ధమా..?
ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరంపై జరిపిన క్షిపణి దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 8న అల్ అసద్ స్థావరంపై.........
ఇరాన్ ప్రతీకార దాడిలో అమెరికా సైనికులకు తీవ్రగాయాలు
వాషింగ్టన్: ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరంపై జరిపిన క్షిపణి దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 8న అల్ అసద్ స్థావరంపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడి వల్ల సైనికులకు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అధికారికంగా ప్రకటించింది. దాడి అనంతరం అక్కడి నుంచి బలగాల్ని జర్మనీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని ప్రస్తుతం అమెరికాకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఈ విషయం ముందుగానే బయటికి పొక్కడంతో అధ్యక్షుడు ట్రంప్ని మీడియా వివరణ కోరింది. సైనికులకు పెద్ద ప్రమాదమేమీ లేదని.. ‘కేవలం తలనొప్పి’ అంటూ ఆయన తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. ‘‘నేను గతంలో చూసిన గాయాలతో పోలిస్తే ఇవి అంత పెద్దవేమీ కాదు’’ అని వ్యాఖ్యానించారు.
దాడి జరిగిన మరుసటి రోజు అమెరికా సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాలైన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పెంటగాన్ వివరణ ఇచ్చింది. పూర్తి వైద్య పరీక్షల అనంతరం నివేదికలతో సహా సమాచారం అంచెలంచెలుగా ఉన్నతాధికారులకు చేరడానికి సమయం పట్టిందని వివరించింది. అలాగే మెదడు సంబంధిత వ్యాధుల్లో పూర్తి స్థాయి లక్షణాలు బయటకు రావడానికి సమయం పడుతుందని తెలిపింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ గాయాల్ని ‘ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీస్’గా వ్యవహరిస్తున్నారు. క్షిపణి పేలుడు వల్ల వాతావరణ పీడనంలో మార్పులు సంభవించి ఈ తరహా సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు.
ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడితో చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో సైనికులెవరూ స్థావరంలో లేకపోవడంతో వారెవరికీ ఏమీ కాలేదని అప్పట్లో అమెరికా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.