విమానాల రద్దుతో వైరస్ను నియంత్రించలేం
చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా సహా పలు దేశాలు చైనాకు నడుపుతున్న విమాన సర్వీసులను క్రమక్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా చైనాలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు...
భారత్, అమెరికా సహా పలుదేశాలపై చైనా ఆగ్రహం
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా సహా పలు దేశాలు చైనాకు నడుపుతున్న విమాన సర్వీసులను క్రమక్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా చైనాలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి హువా చున్యింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కరోనా వైరస్ విషయంలో చైనా ప్రభుత్వం పారదర్శకంగా సమాచారాన్ని తెలియజేస్తూ బాధ్యతతో వ్యవహరిస్తోంది. ఈ వైరస్ని నిలువరించేందుకు చైనా తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సైతం మెచ్చుకుంది. వివిధ దేశాల నుంచి చైనాకు నడుస్తున్న విమాన సర్వీసుల విషయంలో ఇప్పటివరకు డబ్ల్యూహెచ్వో ఎలాంటి ఆంక్షలు విధించలేదు. డబ్ల్యూహెచ్వో నిబంధనలు పాటించాల్సిందిగా వివిధ దేశాల విమానయాన సంస్థలకు అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసీఏవో) మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం విమాన సర్వీసులు రద్దు చేసినంత మాత్రానా కరోనా వైరస్ను నియంత్రించలేం’ అని చున్యింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసేది లేదని హువా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనీయులు ఎక్కడున్నా ఎట్టిపరిస్థితుల్లో వారిని చైనాకు తీసుకొచ్చేస్తామని స్పష్టం చేశారు. విమానాల్లో ఈ వైరస్ సోకేందుకు ఉన్న అవకాశాలను తగ్గించేందుకు చైనా పౌరవిమానయాన పరిపాలనా విభాగం కసరత్తు చేస్తోందని హువా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలు పారదర్శక ధోరణితో ముందుకు సాగాలని.. అనవసర భయాలకు గురికావద్దని హువా సూచించారు. చైనాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు సర్వీసులు రద్దు చేసుకోవద్దని కోరారు. వెంటనే విమాన సర్వీసులను పునరుద్ధరించాలన్నారు. ఐసీఏవో, డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలకు అనుగుణంగా విమానయాన సంస్థలు చైనాకు వచ్చే సర్వీసులను పునరుద్ధరించాలని హువా చున్యింగ్ కోరారు.
చైనాలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటికే 563 మంది చనిపోగా.. అందులో ఒక్క బుధవారమే 73 మంది చనిపోయారు. మరో 28,018 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు కరోనా మహమ్మారి వ్యాపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం