ఇటలీలో ఒక్కరోజే 627 కరోనా మరణాలు..
ప్రపంచంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి దేశాలు అల్లాడిపోతున్నాయి.........
జెనీవా: ప్రపంచంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక కొత్తగా సోకుతున్న వారి సంఖ్య అదుపులో లేకుండా పోతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే దేశాలన్నీ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇటలీలో తీవ్రత మరింత ఎక్కువైంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 627 మంది మహమ్మారికి బలైపోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 4032కు చేరింది. మరో 6000 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 47,021కు పెరిగింది. గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య 1500 దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వల్ల సంభవించిన మరణాల్లో ఇటలీ వాటాయే 36.6 శాతంగా ఉంది. ఇప్పటికే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని యోచిస్తోంది. ఆదివారం కూడా దుకాణాలు తెరవకుండా ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
45 రోజుల స్వీయ నిర్బంధం పాటించండి.. ఇమ్రాన్
దాయాది దేశం పాకిస్థాన్లోనూ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. శుక్రవారం మరొకరు మరణించడంతో ఇప్పటి వరకు అక్కడ మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. దీంతో అప్రమత్తమైప ప్రభుత్వం ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేసింది. మరో 45 రోజుల పాటు ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధం పాటించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. సింధ్, కరాచీ ప్రావిన్సుల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయ. ఇప్పటి వరకు 481 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క సింధ్లోనే 249 కేసులు నిర్ధారణ కావడం గమనార్హం.
జింబాబ్వేలో తొలి కేసు..
జింబాబ్వేలో శుక్రవారం తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటీవల బ్రిటన్ వెళ్లొచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కరోనా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో కనీస వసతుల లేవన్న విమర్శలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే అక్కడి డాక్టర్లు వేతనాలు పెంపు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సమ్మెకు దిగారు.
ఫ్రాన్స్లో 24 గంటల్లో 78 మంది...
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్లో గత 24 గంటల్లో 78 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి మృతుల సంఖ్య 450కు చేరింది. మరో 12,612 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న వాదన ఉంది. టెస్టింగ్ కిట్ల కొరత కారణంగా చాలా మందికి పరీక్షలు చేయలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 13,00 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది 60 ఏళ్ల పైబడినవారేనని తెలుస్తోంది.
బ్రెజిల్ వృద్ధి రేటు సున్నా...
బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ పెనుప్రభావమే చూపబోతోంది. ఈ యేడు దేశంలో దాదాపు సున్నా శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇంతకుముందు ఉన్న 2.1శాతాన్ని పూర్తిగా 0.02కు తగ్గిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అక్కడ వైరస్ వల్ల 11 మంది మరణించగా.. మరో 911 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది.
యూకేలో ఆంక్షలు మరింత కఠినం..
వైరస్ వ్యాప్తి పెను సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని మరింత కఠినతరం చేసేందుకు యూకే సిద్ధమైంది. థియేటర్లు, జిమ్స్, రెస్టారెంట్లు, బార్స్, పబ్బులు, ప్రజలు అధిక సంఖ్యలో రావడానికి ఆస్కారమున్న కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. వైరస్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు యూకే వైరస్ బారిన పడి 177 మంది బలయ్యారు. మరో 3,269 మంది వైరస్ బాధితులుగా మారారు. మరోవైపు దేశంలో కార్మికులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి రిషి సునక్ హామీ ఇచ్చారు. 80 శాతం మంది ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రష్యాలో వుహాన్ తరహా ఆస్పత్రి...
చైనాలోని వుహాన్లో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన తరహాలోనే రష్యా కూడా నిర్మించ తలపెట్టింది. ఇందుకు రాజధాని మాస్కోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని వేదికగా ఎంచుకున్నారు. దాదాపు 3200 మంది సైనిక సిబ్బందిని రంగంలోకి దింపారు. రష్యాలో ఇప్పటి వరకు 253 మందికి వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న విమర్శలు ఉన్నాయి.
దేశం | బాధితులు | మృతులు |
ఇటలీ | 47,021 | 4,032 |
చైనా | 81,008 | 3,255 |
ఇరాన్ | 19,644 | 1,433 |
స్పెయిన్ | 21,571 | 1,093 |
ఫ్రాన్స్ | 12,612 | 450 |
అమెరికా | 18,860 | 230 |
భారత్ | 258 | 04 |
ప్రపంచవ్యాప్తంగా | 2,76,113 | 11,402 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.