అప్పుడు స్పానిష్ఫ్లూను.. ఇప్పుడు కరోనాను
1920 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ పట్టి పీడించిన సంగతి తెలిసిందే. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా వైరస్తో ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ రెండు
మాడ్రిడ్: 1918 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ పట్టి పీడించిన సంగతి తెలిసిందే. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా వైరస్తో ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ రెండు మహమ్మారుల బారిన వాటిని జయించి నిలిచింది 106 సంవత్సరాల అనా డెల్. స్పెయిన్కు చెందిన అనా 1913లో జన్మించింది. ప్రస్తుతం కరోనా మాదిరిగానే.. నాడు 1918 నుంచి 1920 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ విజృంభించింది. అప్పట్లోనే 500 మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకింది. వారిలో అనా కూడా ఉన్నారు. 1918లో చిన్నారిగా ఉన్న, నాటి మహమ్మారి స్పానిష్ ఫ్లూను తట్టుకుని బతికింది.
ఇప్పుడు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. 102 సంవత్సరాల అనంతరం అనాకు ఇప్పుడు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మరి దెబ్బకు ఆ దేశంలో 22,524 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 106 సంవత్సరాల అనా.. కొవిడ్-19 బారిన పడి మళ్లీ కోలుకున్నారు. స్థానిక పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్లో 60 మంది ఇతర కొవిడ్-19 బాధితులతో పాటు ఆమె కూడా చికిత్స పొందింది. కొద్ది రోజుల తర్వాత కోలుకోవడంతో వైద్యులు ఆమె డిశ్చార్జీ చేశారు. ఇంకో ఆరునెలల్లో ఆమెకు 107 సంవత్సరాలు నిండుతాయి. కరోనాను జయించిన అతి పెద్ద వయస్కురాలిగా నెదర్లాండ్స్కు చెందిన కొర్నీలయా రాస్ పేరున రికార్డు ఉంది. అయితే స్పానిష్ ఫ్లూ, కరోనా రెండింటినీ తట్టుకున్న వారిలో అనా వయస్సే అతి పెద్దదట. అయితే ఆమె వయస్సు దృష్ట్యా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.