వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: ట్రంప్
కొవిడ్-19 కారక కరోనా వైరస్ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.......
ఆధారాలను ఇప్పుడే చెప్పలేనన్న అగ్రరాజ్యాధిపతి
వాషింగ్టన్: కొవిడ్-19 కారక కరోనా వైరస్ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ వైరస్ చైనాలోని వుహాన్లో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వివరాలను వెల్లడించానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. దీనిపై ఇంకా లోతైన విచారణ జరుగుతోందని.. త్వరలోనే వాటి ఫలితాలు బయటకు వస్తాయని తెలిపారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అంత బలంగా ఎలా చెప్పగలరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..‘‘నేను ఆ విషయాలు బటయకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే, ఈ విషయంలో తాను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను బాధ్యుణ్ని చేయలేనన్నారు. కానీ, ఆదిలోనే దాన్ని నిలువరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా కట్టడి చేయలేకపోయిందా.. లేక కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. బహుశా కీలక సమయంలో స్పందించకపోయి ఉండడం వల్లే చేజారిపోయి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆయన ఇటలీ పరిస్థితిని ఉటంకించారు. అయితే, అసలు చైనాలో ఏం జరిగిందన్నది మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. దానిపైనే విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.
అంతకు ముందు కరోనా వైరస్ మానవులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. అలాగే అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని వివరించాయి. ఈ ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది గుర్తించనున్నట్లు వెల్లడించాయి.
ఇవీ చదవండి..
కొవిడ్పై రెమిడెసివిర్ పనిచేస్తోంది: గిలీద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్