హెచ్చరించినా పట్టించుకోనిపైలట్..
పాకిస్థాన్లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే
పాక్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లాహోర్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన విమానం కరాచీకి దగ్గర్లో కూలిపోయింది. అయితే ఆ ప్రమాదానికి ముందు పైలట్ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) విభాగం మూడు సార్లు హెచ్చరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ద్వారా వెల్లడవుతుంది. విమానం ఉన్న ఎత్తు, ల్యాండ్ అయ్యే ముందు దాని వేగం గురించి ఏటీసీ చేసిన హెచ్చరికలను అతడు పట్టించుకోలేదని తెలుస్తుంది.
కరాచీకి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని, వెంటనే 7,000 అడుగుల పరిధిలోకి తీసుకురావాలని అధికారులు మొదటి సారి పైలట్ను హెచ్చరించారని పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తయారు చేసిన ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఎత్తు తగ్గించకపోగా, సాఫీగానే ఉందని పైలట్ వారికి చెప్పారని తెలిపింది. కరాచీకి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఎత్తును తగ్గించాలంటూ ఇదేవిధమైన హెచ్చరిక చేసినా అతడు పట్టించుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అప్పుడు కూడా తాను చూసుకోగలని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కరాచీలో మొదటి సారి విమానం దించాలనుకున్నప్పుడు, కుదుపులకు లోనై, రన్వే కొద్ది మేర పాడైనట్లు వెల్లడించారు. దాంతో కొద్ది మేర మంటలు చెలరేగాయిని, అప్పుడే ఆయిల్ ట్యాంక్, పైప్ లీక్ అయ్యుండొచ్చని వారు అభిప్రాయడ్డారు. అప్పుడు విమానాన్ని 3000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లమని చెప్పినా, అతడు మాత్రం 1800 అడుగుల వద్దే ఉంచాడని చెప్పారు. అయితే ఆ ఎత్తుకు రాకపోవడానికి ఇంజిన్లో సమస్య కూడా కారణం కావొచ్చన్నారు. ఆ తరవాత విమానం ఒక్కసారిగా కూలిపోయి ఉంటుందన్నారు.
కరోనా నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తూ దేశీయంగా విమాన రాకపోకలకు పాకిస్థాన్ ప్రభుత్వం మే 16న అనుమతిచ్చింది. ఈ ప్రమాదం జరగడంతో మళ్లీ ఆ అనుమతులను వెనక్కి తీసుకుంది. ఘటన జరిగినప్పుడు విమానంలో ఉన్న 91 మంది ప్రయాణికులు, ఎనిమిదిమంది సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.