కరోనా: ఆ రెండు మందులు కలిపిస్తే..
కరోనా మహమ్మారి ప్రబలిన దగ్గరి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా చాలామంది నోళ్లలో నానుతున్న పదం హైడ్రాక్సీ క్లోరోక్విన్.
దిల్లీ: కరోనా మహమ్మారి ప్రబలిన దగ్గరి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా చాలామంది నోళ్లలో నానుతున్న పదం హైడ్రాక్సీ క్లోరోక్విన్. కొవిడ్ 19 బాధితుల చికిత్సలో ఈ మందు వాడకం గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే దీన్ని వాడటం వల్ల గుండె మీద దుష్ప్రభావం చూపుతుందని వాండర్బిల్ట్, స్టాన్ఫోర్డు యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీన్ని అజిత్రోమైసిన్ యాంటి బయోటిక్తో కలిపి ఇస్తే ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వారు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాబేస్లో ఉన్న 21 మిలియన్ల కేసు రిపోర్టులను విశ్లేషించిన అనంతరం వారు నివేదికను తయారు చేశారు.
కొవిడ్ 19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధాలను విడిగా కానీ, కలిపికానీ వాడాలన్న ప్రతిపాదన నేపథ్యంలో వారు ఈ పరిశోధన చేపట్టారు. వాటి వాడకం గుండె కొట్టుకొనే క్రమపద్ధతిని దెబ్బతీస్తుందని వెల్లడించారు. క్లోరోక్విన్తో పోల్చుకుంటే అజిత్రోమైసిన్తో ఈ ప్రభావం మరీ ఎక్కువని అన్నారు. ఇక ఆ రెండింటిని కలిపితే ఆ తీవ్రత మరింత అధికమని తెలిపారు. క్లోరోక్విన్ కొన్ని నెలల పాటు వాడితే రక్త ప్రసరణను దెబ్బతీసి, గుండె వైఫల్యానికి దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తూ వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.