పూరీ రథయాత్ర వద్దు: సుప్రీం
కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తోన్న తరుణంలో..ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రను నిలిపివేయాలని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆలయ నిర్వాహకులను ఆదేశించింది.
దిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తోన్న తరుణంలో..ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రను నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆలయ నిర్వాహకులను ఆదేశించింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ రథయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకోకుండా ఉంటే జూన్ 23న ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించేవారు.
ఈ నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ..‘ఈ యాత్ర జరగడానికి అనుమతి ఇస్తే, జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు. ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ ఏడాది రథయాత్రను అనుమతించం’ అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలు పాటిస్తూ ఆలయంలో కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘అలాంటి విషయాల్లో మాకు కావాల్సినన్నీ అనుభవాలున్నాయి. ఒక్క చిన్న కార్యక్రమానికి అనుమతి ఇచ్చినా..ప్రజలు వారి మతపరమైన ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అందుకే ఈ ఏడాది దేనికి అనుమతి లేదు’ అని బాబ్డే తేల్చిచెప్పారు.
ఒడిశా వికాస్ పరిషద్ అనే ఎన్జీఓ ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రథయాత్ర జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని, అదే జరిగి, లక్షల్లో భక్తులు వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ వ్యాజ్యంలో ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జరిగిన యాత్రను వీక్షించడానికి సుమారు 10లక్షల మంది హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.