ఎంపీ రామ్మోహన్‌కు సంసద్‌ రత్న అవార్డ్‌

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయకుడుకి సంసద్‌ రత్న పురస్కారం లభించింది. అతి పిన్నవయసులోనే ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. పార్లమెంటరీ వ్యవహారాల....

Updated : 24 Jun 2020 19:32 IST

దిల్లీ: శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయకుడుకి సంసద్‌ రత్న పురస్కారం లభించింది. అతి పిన్నవయసులోనే ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. పార్లమెంట్‌ సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరును గుర్తించి ఈ పురస్కారం ఇస్తారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంపీలు చూపించే చొరవను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌, శ్రీరంగ్‌ అప్పా బర్నే, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ఎంపిక చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ... జిల్లా ప్రజలు, తెదేపా, కింజరాపు అభిమానులకు ఈ పురస్కారం అంకితమిస్తున్నట్లు తెలిపారు. 

2020 సంసద్‌ రత్న విజేతలు వీరే

లోక్‌సభ సభ్యులు
* రామ్మోహన్‌ నాయుడు (ఆంధ్రప్రదేశ్‌)

సుప్రీయ సూలే (మహారాష్ట్ర)

* సుభాష్‌ రామ్‌రావ్‌ భ్రమే (మహారాష్ట్ర)

* మీనా విజయ్‌కుమార్‌ గవిట్‌ (మహారాష్ట్ర)

* అమోల్‌ రామ్‌ సింగ్‌ కోలే (మహారాష్ట్ర)

* శశి థరూర్‌ (కేరళ)

* నిశికాంత్‌ దూబె (ఝార్ఖండ్‌)

* అజయ్‌ మిశ్రా (ఉత్తర్‌ ప్రదేశ్‌)

రాజ్యసభ సభ్యులు

* విశంబర్‌ ప్రసాద్‌ నిషాద్‌ - రాజ్యసభ (ఉత్తర్‌ప్రదేశ్‌)

* చాయా వర్మ - (ఛత్తీస్‌గఢ్‌)

ఇంకా...

* పీసీ గద్దిగౌడర్‌ (వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌)

ఇక గత లోక్‌సభకు సంబంధించి సంసద్‌ మహారత్న పురస్కారాలు కూడా వెల్లడించారు. భర్తృహరి మహతాబ్‌ (ఒడిశా), సుప్రియ సూలె (మహారాష్ట్ర), శ్రీరంగ్‌ అప్పా బర్నే (మహారాష్ట్ర) ఈ పురస్కారాలు గెలుచుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని