85% కరోనా కేసులు 8 రాష్ట్రాల్లోనే..!
భారత్పై కరోనా వైరస్ ఉరుముతోంది. రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులతో జనంలో కలవరం.....
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ వెల్లడి
దిల్లీ: భారత్పై కరోనా వైరస్ ఉరుముతోంది. రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులతో జనంలో కలవరం మరింతగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మరో 18,552 కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేయగా.. మరణాల సంఖ్య 15600కు చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ నేతృత్వంలోని కేంద్రమంత్రుల ప్రత్యేక బృందం సమావేశమై కట్టడి చర్యలపై సమీక్షించింది. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 85.5%, ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 87% కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్ ,తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయని తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసులు ఇలా..
మూడు రాష్ట్రాల్లో మరీ అధికం
మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.53లక్షల కేసులు, 7106 మరణాలు నమోదు కాగా.. దిల్లీలో 77240 కేసులు, 2492 మరణాలు; తమిళనాడులో 74622 కేసులు, 957 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఈ మూడే. అలాగే, గుజరాత్లో 30వేల కేసులు రాగా.. యూపీలో 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
58%పైగా రికవరీ
దేశంలో ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 58%పైగా నమోదైంది. అలాగే, 16,685 మంది మృత్యువాతపడటంతో మరణాల రేటు దాదాపు 3శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.98 లక్షల మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. లాక్డౌన్ల వారీగా రికవరీ రేటు..
మరోవైపు, రాష్ట్రాలకు సాంకేతికంగా సహాయం అందించేందుకు వైద్య, అంటువ్యాధుల నిపుణులు, ఇతర ప్రత్యేక అధికారులతో కూడిన 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే మరో కేంద్ర బృందం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.
కేంద్రమంత్రి హర్షవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జైశంకర్, హర్దీప్సింగ్ పూరీ, అశ్వినికుమార్ చౌబీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన గణాంకాలను ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ భార్గవ వివరించారు.
గడిచిన 24గంటల్లో 2,20,479 శాంపిల్స్ను పరీక్షించినట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79,96,707 శాంపిల్స్ పరీక్షించినట్టు వివరించారు. అలాగే, దేశంలో ప్రస్తుతం 1026 డయాగ్నోస్టిక్ ల్యాబ్లలో పరీక్షలు చేస్తుండగా.. వీటిలో 741 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా.. మిగతా 285 ల్యాబ్లు ప్రైవేటువని తెలిపారు.
దేశంలో కరోనా పరిస్థితి ఇదీ.. (ఇన్ఫోగ్రాఫ్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం