Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Updated : 27 Jan 2023 09:23 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గోరఖ్‌పుర్‌ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్‌ గ్రామంలో కైలాశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం కాగా, అందరూ వివాహాలు చేసుకొని వేరు కాపురాలు పెట్టారు. కొన్నేళ్ల క్రితం కైలాశ్‌ మూడో కుమారుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగా మిగిలింది. ఇదిలా ఉండగా ఇటీవలే కైలాశ్‌ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పూజ నుదుట కైలాశ్‌ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని