Bengaluru: బెంగళూరులో భార్యాబాధితుల నిరాహార దీక్ష

గృహహింస చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని భార్యా బాధితుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 26 Feb 2023 06:44 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: గృహహింస చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని భార్యా బాధితుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌’తో కలిసి సంఘం ప్రతినిధులు శనివారం బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని సంఘం సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫు కుటుంబసభ్యులనూ వేధిస్తున్నారని సంఘ సభ్యులు వాపోయారు. ఎన్‌ఆర్‌ఐల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటుచేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని