80వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?
పంజాబ్లో 80 వేల మంది పోలీసులున్నా ఖలిస్థాన్ అనుకూల మత బోధకుడు అమృత్పాల్ సింగ్ను పట్టుకోలేకపోవడం నిఘా వర్గాల వైఫల్యమేనని పంజాబ్-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది.
అమృత్పాల్ పరారీ నిఘా వైఫల్యమే
పంజాబ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు
చండీగఢ్: పంజాబ్లో 80 వేల మంది పోలీసులున్నా ఖలిస్థాన్ అనుకూల మత బోధకుడు అమృత్పాల్ సింగ్ను పట్టుకోలేకపోవడం నిఘా వర్గాల వైఫల్యమేనని పంజాబ్-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రూపొందించినా నిందితుడు తప్పించుకోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అమృత్పాల్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనీ, కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది ఈమాన్సింగ్ ఖారా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ ఎన్.ఎస్.షెకావత్ మంగళవారం విచారణ చేపట్టారు. పకడ్బందీ వ్యూహం ఉన్నప్పుడు నిందితుడు పోలీసుల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడని పంజాబ్ అడ్వకేట్ జనరల్ వినోద్ ఘాయ్ను ఆయన ప్రశ్నించారు. నిందితుడిని పట్టుకునేందుకు పెద్దఎత్తున రంగంలో దిగి 120 మంది అనుచరులను అదుపులోకి తీసుకోగలిగామనీ, వాహనశ్రేణిని వెంబడిస్తున్న సమయంలో సింగ్ మాత్రం తప్పించుకున్నాడని ప్రభుత్వం తెలిపింది.
ఆయుధాలతో వెళ్లి పట్టుకోలేకపోయారా?
పంజాబ్ పోలీసుల పనితీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘80 వేల మంది పోలీసులు మీ దగ్గర ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? ఆయుధాలతో అందరూ రంగంలో దిగినా అమృత్పాల్ ఎలా తప్పించుకోగలిగాడు? అనుచరులంతా దొరికి, అమృత్పాల్ చేజారడాన్ని నమ్మలేకపోతున్నాను’ అని జస్టిస్ షెకావత్ వ్యాఖ్యానించారు. నిందితుడిపై, అతని అనుచరులపై ‘జాతీయ భద్రత చట్టం’ (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు ప్రమాణ పత్రంలో ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్ అంతా బహిరంగ స్థలంలో జరగడంతో భద్రతపరమైన కారణాలతో సంయమనం పాటించాల్సి వచ్చిందని పంజాబ్ ఏజీ చెప్పారు. కొన్ని సున్నితమైన విషయాలను కోర్టులో బాహాటంగా చెప్పలేమని, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల తరఫున అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని స్పష్టంచేశారు. అమృత్పాల్ తమ అదుపులో లేడని, సోమవారమే నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. దేశం నుంచి పంజాబ్ విడిపోవాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని వివరించింది. నిందితుడు శనివారం తప్పించుకున్న తీరును కోర్టుకు తెలిపింది. అమృత్పాల్ తండ్రి కూడా హైకోర్టును ఆశ్రయించినా ఆయన ఈ కేసులో కక్షిదారుడు కానందున వాదనలు వినలేమని న్యాయమూర్తి తెలిపారు.
అమృత్పాల్ కేసులో నలుగురి అరెస్ట్
అమృత్పాల్ పరారయ్యేందుకు సహకరించిన నలుగురిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆహార్యాన్ని మార్చుకుని, నల్లని కళ్లద్దాలు ధరించి, ఓ బైకు వెనుక కూర్చొని నిందితుడు తప్పించుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడిపై లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.
12 మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్
ఖలిస్థాన్ అనుకూల సంస్థలతో, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న కుట్రదారులతో సంబంధాలున్న 12 మందిపై ‘జాతీయ భద్రత సంస్థ’ (ఎన్ఐఏ) మంగళవారం మొదటి అభియోగపత్రం దాఖలు చేసింది. కెనడాలో, మరికొన్ని దేశాల్లో ఉన్న ఖలిస్థాన్ అనుకూల శక్తులతో వీరికి సంబంధాలున్నాయని తెలిపింది. కొందరు నాయకులు, గాయకులు, వ్యాపారవేత్తల్ని మట్టుబెట్టడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలనే కుట్రతో ప్రమేయం ఉన్న మరో 10 మందిని ఎన్ఐఏ విచారిస్తోంది. నిషిద్ధ ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’తో నిందితులకు ఉన్న సంబంధాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగుచూశాయని సంబంధిత అధికారులు తెలిపారు. పంజాబ్, హరియాణాల్లో వేర్వేరు చోట్ల దాచిపెట్టిన ఆయుధాలను వెలికితీసినట్లు చెప్పారు.
బైకుపై తప్పించుకువెళ్లాడు
నిందితుడు తప్పించుకునేందుకు సహకరించిన నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల కళ్లుగప్పి బయటపడిన నిందితుడు జలంధర్లో ఒక గురుద్వారాకు వెళ్లి, దుస్తులు మార్చుకుని, ముగ్గురితో కలిసి బైకుపై పరారైనట్లు వీరిని విచారించినప్పుడు తేలిందని పంజాబ్ ఐజీపీ సుఖ్చైన్సింగ్ గిల్ వివరించారు. మొబైళ్లలో ఇంటర్నెట్ వినియోగంపై విధించిన ఆంక్షల్ని పంజాబ్లో నాలుగైదు జిల్లాలు మినహా మిగిలినచోట్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎత్తివేశారు. వేర్వేరు దుస్తుల్లో నిందితుడు ఎలా ఉంటాడో తెలిపే ఛాయాచిత్రాలను పోలీసులు విడుదల చేసి, అతన్ని పట్టుకోవడంలో ప్రజల సహకారాన్ని కోరారు. అమృత్పాల్ సింగ్ శనివారం కారులో వెళ్తున్నప్పటి సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. కారు ముందు సీటులో నిందితుడు కూర్చొన్నట్లు కనిపిస్తోంది. పోలీసుల వేట నాలుగో రోజుకు చేరింది. సింగ్ పంజాబ్ దాటి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఉపయోగించిన రెండో కారును, కొన్ని దుస్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు