‘భారత్’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి
‘భారత్, సనాతన ధర్మం’ అంశాలపై ఆచితూచి మాట్లాడాలని.. కేంద్రమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం.
దిల్లీ: ‘భారత్, సనాతన ధర్మం’ అంశాలపై ఆచితూచి మాట్లాడాలని.. కేంద్రమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘భారత్’ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై అతిగా స్పందించొద్దని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపాయి. అయితే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు సమాచారం. ‘‘చరిత్ర లోతుల్లోకి తొంగిచూడొద్దు. కానీ, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడండి. వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరం’’ అని మోదీ సూచించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలతో పాటు జీ20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్ అని ముద్రించింది. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్ మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
అధికార వాహనాలను విడిచిపెట్టండి
జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. సమావేశం జరిగే భారత్ మండపం సహా ఇతర వేదికలు వద్దకు చేరుకునేందుకు అధికారిక వాహనాలను పక్కనబెట్టి షటిల్ సర్వీసులను ఉపయోగించాలని కోరారు. జీ20 ఇండియా మొబైల్ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తద్వారా విదేశీ ప్రతినిధులతో జరిపే సంభాషణల్లో అందులోని అనువాద సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ యాప్ అన్ని భారతీయ భాషలతోపాటు, జీ20 దేశాల భాషలను తర్జుమా చేయగలదు.
కొందరికి ఆహ్వాన బాధ్యతలు
అంతర్జాతీయ సంస్థలకు చెందిన అధిపతులతోపాటు 40 మంది ప్రపంచ నేతలు ఈ నెల 9-10 తేదీల్లో జరిగే జీ20 సదస్సుకు హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ సంబంధిత విషయాలను వెల్లడించారు. విదేశీ ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొందరు మంత్రులకు అప్పగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనాలని ‘ఇండియా’ కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించాయి. -
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్ పొడిగించాలని సుప్రీంను అభ్యర్థించిన నేపథ్యంలో భాజపా నేత, సీఎం ఇంటికి అంబులెన్స్ పంపడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. -
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
ఇంటి పెద్దదిక్కు కన్ను మూసినా.. ఓటును హక్కును మరవలేదు బిహార్లోని ఓ కుటుంబం. ఓటు బాధ్యతను నిర్వర్తించాకే.. అంత్యక్రియులు నిర్వహించింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును దిల్లీకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. దాంతో రేపు ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
Prajwal Revanna: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. -
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఖలీల్ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో ఉంది. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. -
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
బ్రాంచ్ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
ఓ అల్లరి మూక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది. -
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. -
మలద్వారంలో 960 గ్రాముల బంగారం.. కేరళలో ఎయిర్హోస్టెస్ అరెస్ట్
కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి బంగారం అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. -
సుప్రీం కొలీజియం నిర్ణయాల్లో జోక్యానికి దిల్లీ హైకోర్టు నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులను నిరాకరించడానికి కారణాలేమిటో సుప్రీంకోర్టు కొలీజియం సవివరంగా తెలియజేసేలా ఆదేశించాలని కోరుతూ రాకేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నయనతారతో టూర్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్
-
ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
-
5జీ కనెక్టవిటీకి డ్రోన్లు, బెలూన్లు.. డాట్ ‘ఎమర్జెన్సీ’ సన్నద్ధత
-
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
-
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు