బంగారం అక్రమ రవాణాకు భారతీయ వలస కార్మికులు!
బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సింగపూర్లోని స్మగ్లరు భారతీయ వలస కార్మికులను కూలికి (గోల్డ్ మ్యూల్స్గా) నియమించుకుంటున్నారని ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది.
సింగపూర్ చాంగీ విమానాశ్రయంలో నియమించుకుంటున్న స్మగ్లర్లు
మీడియా కథనంలో వెల్లడి
సింగపూర్: బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సింగపూర్లోని స్మగ్లరు భారతీయ వలస కార్మికులను కూలికి (గోల్డ్ మ్యూల్స్గా) నియమించుకుంటున్నారని ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది. చాంగీ విమానాశ్రయం నుంచి భారత్కు బయలుదేరే భారతీయ కార్మికులను ఈ మేరకు స్మగ్లర్లు సంప్రదిస్తున్నారని, తాము ఇచ్చిన బంగారాన్ని భారత్కు తీసుకెళ్లి అప్పగిస్తే వారికి కొంత రుసుము చెల్లిస్తున్నారని వెల్లడించింది. బంగారం రవాణాకు ఆసక్తి చూపిన వారిని విమానాశ్రయంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళుతున్నారని, అక్కడ ఒప్పందం కుదురుతోందని తెలిపింది. సాధారణంగా 25 గ్రాముల నుంచి 30 గ్రాముల బంగారాన్ని పంపేందుకు స్మగ్లర్లు ఆసక్తి చూపుతున్నారని ‘ద స్ట్రెయిట్స్ టైమ్స్’ తన కథనంలో వెల్లడించింది. సింగపూర్ నుంచి విదేశాలకు బంగారం, ఇతర విలువైన రాళ్లను తీసుకెళ్లడం చట్ట వ్యతిరేకం కానప్పటికీ, కార్మికులు మాత్రం భారత్లో దిగిన తర్వాత ఒక్కోసారి చట్ట ఉల్లంఘనలకు పాల్పడాల్సి వస్తుందని జెమ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు మొహమ్మద్ బిలాల్ తెలిపారు. బంగారం తీసుకొస్తున్న సంబంధిత కార్మికులు ఆ విషయాన్ని ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమన్నారు. కార్మికుల ద్వారా బంగారాన్ని తరలించడం దశాబ్దాలుగా ఉన్నదేనని బిలాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే భారతీయులు పురుషులైతే 20 గ్రాముల వరకు సుంకం చెల్లించకుండా బంగారాన్ని తమ వెంట తెచ్చుకోవచ్చు. మహిళల విషయంలో ఈ పరిమితి రెట్టింపు. ఈ పరిమితులకు మించి బంగారం తీసుకొస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, సింగపూర్ నుంచి విదేశాలకు ఎంత పరిమాణంలోనైనా బంగారం, ఇతర విలువైన రాళ్లను తరలించవచ్చు. బంగారం అక్రమ రవాణాపై భారత అధికారులు దృష్టి పెడుతుండడంతో స్మగ్లర్లు సింగపూర్, మలేసియా సహా గల్ఫ్, ఆసియాల్లోని వివిధ విమానాశ్రయాల్లోని ప్రయాణికులను సంప్రదిస్తున్నారని ‘ద స్ట్రెయిట్స్ టైమ్స్’ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక విమానం ఎగరకముందే.. అదే రన్వేపై మరొకటి దిగింది
దాదాపు 300 మంది ప్రయాణికులకు శనివారం ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. అదే రన్వేపైకి ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ దిగింది. -
37 మందికి మంత్రులుగా తిరిగి దక్కని చోటు
మోదీ 2.0 సర్కారులో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్ ర్యాంకు అమాత్యులు కాగా, మిగిలిన 30 మంది సహాయమంత్రులు. -
యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. -
సప్త దేశాధినేతల సాక్షిగా..
రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసే వేడుకకు ఏడు దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవిండ్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మత్ అఫీఫ్ ఉన్నారు. -
మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం
-
విదేశీ అతిథులకు రాష్ట్రపతి విందు
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన ఇతర దేశాల అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. -
మణిపూర్లో నియంత్రణలోనే పరిస్థితులు
మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతానికైతే నియంత్రణలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
కంగనాను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్కు మద్దతుగా రైతు సంఘాల ర్యాలీ
నటి, భాజపా ఎంపీ కంగనారనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్కు మద్దతుగా వివిధ రైతు సంఘాలు ర్యాలీ చేపట్టాయి. -
మోదీ.. మూడోసారి పట్టాభిషేకం
దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్దాస్ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. -
‘బిలియనీర్ పన్ను’కు మద్దతిస్తారా?: కొత్త ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ప్రశ్న
ప్రపంచ దేశాల్లో ‘బిలియనీర్ పన్ను’ (Billionaire tax)పై చర్చ నడుస్తోందని.. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థిక మంత్రి ఎవరికి మద్దతు ఇస్తారు? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.