ఆరు దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో ఓటేయనున్న జనం
ఆరు దశాబ్దాలుగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎన్నికలకు దూరమైన జనం ఈసారి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఒడిశాలో ఏర్పాట్లు
మల్కాన్గిరి, న్యూస్టుడే: ఆరు దశాబ్దాలుగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఎన్నికలకు దూరమైన జనం ఈసారి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పరిధి రలెగెడ, పాపరమెట్ల, ధులిపుట్, గాజలమాముడి, జోడాంబో, జంత్రి, బడపడా, బడపదర్, నకామాముడి పంచాయతీల ప్రజలను (సుమారు 20వేల మంది) ఆరు దశాబ్దాల క్రితం బలిమెలలో జలాశయ నిర్మాణం దృష్ట్యా గురుప్రియ నది ఆవలకు తరలించారు. అందరికీ ఇళ్లు, స్థలాలు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదు. వీరు నది ఆవల అటవీ ప్రాంతంలో ఉండిపోవడంతో నేతలు, అధికారులు అటువైపు వెళ్లేందుకు వీలులేక ఎవరూ చొరవ చూపలేదు. దీంతో ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే నదిపై నాటు పడవ, మోటర్ బోట్ల సాయంతో వెళ్లాల్సిందే.
మావోయిస్టుల ప్రభావం
ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. 1998లో మల్కాన్గిరి జిల్లా కలిమెల సమితిలో మొదటిసారి కమిటీలు వేసిన మావోయిస్టులు.. చిత్రకొండ సమితిలోని 9 గ్రామ పంచాయతీలను ఆక్రమించుకున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హెలికాప్టర్ సాయంతో పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులను తరలించి ఓటు వేయించేవారు. అతి తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునేవారు. కొన్నిసార్లు నాటు పడవ, మోటారు బోటు సహాయంతో బ్యాలెట్ బాక్సులు, ఈవీఎం యంత్రాలను తీసుకెళ్తే మావోయిస్టులు వాటిని ఎత్తుకెళ్లేవారు. 2011లో అప్పటి కలెక్టరు ఆర్.వినీల్ కృష్ణ ఈ గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆ సమయంలో ఆయనను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 10 రోజుల తర్వాత వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో వదిలి పెట్టారు. 2018లో ఈ ప్రాంతంలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగింది. బి.ఎస్.ఎఫ్. క్యాంపులు, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది. రహదారులు నిర్మాణమై వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.
ఓకేచోట 23 బూత్లు
వంతెన నిర్మాణం తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గత పంచాయతీ ఎన్నికల్లో జంత్రి గ్రామంవద్ద 23 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధిక శాతం ఓట్లు నమోదయ్యాయి. యంత్రాంగం ఈ సారి ప్రతి గ్రామంలోనూ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. పోలీసులు, బి.ఎస్.ఎఫ్. జవాన్లను రక్షణ కోసం మోహరించనున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ 60ఏళ్ల తర్వాత వారి స్వగ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీలో నేడు కేజ్రీవాల్ రోడ్షో
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై విపక్ష ఇండియా కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఉద్దేశించి మధ్యప్రదేశ్లోని రత్లాం నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది
కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసిందని, భవిష్యత్తులో తమ రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అంగీకరించారు. -
మీ వ్యాఖ్యలతో ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం
సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ డేటాపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
కాంగ్రెస్లో విలీనమయ్యే బదులు.. ఎన్డీయేతో చేతులు కలపండి
కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడంకన్నా భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) అధినేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ఒడిశా అసెంబ్లీ బరిలో హేమాహేమీలు
ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 147. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కనీసం 74 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. -
అమృత్పాల్ సింగ్ మొత్తం ఆస్తి రూ.1,000.. అస్సాం జైలు నుంచి నామినేషన్
‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ అధిపతి, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ (31) తనకున్న మొత్తం ఆస్తి వెయ్యి రూపాయలుగా ఎన్నికల ప్రమాణ పత్రంలో వెల్లడించాడు. -
రాజ్యాంగాన్ని 80సార్లు సవరించిన కాంగ్రెస్
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది. -
పనితీరుపై కాకుండా పాక్ చర్చ ఎందుకు?
ఎన్నికలు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇక్కడి అంశాలపై కాకుండా పాకిస్థాన్పై చర్చ ఎందుకని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. -
ఓటేయండి.. సగం ధరకే సినిమా చూడండి
‘ఓటు వేయండి.. ఆపై మీకు నచ్చిన థియేటర్లో సగం ధరకే సినిమా చూడండి’ అంటూ పట్నా సాహిబ్ లోక్సభ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
కన్నౌజ్ పోరు.. ‘అత్తరు’ గుబాళింపు ఎటువైపో ?
మే 13న జరిగే పోలింగ్లో కన్నౌజ్ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఎన్నికలు భారత్లో జరుగుతుంటే.. పాకిస్థాన్ ప్రస్తావనెందుకు?: ప్రియాంక గాంధీ
వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికల ప్రచారంలో భాజపా మతాలను ప్రస్తావిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
ఇది ప్రజాస్వామ్య విజయం: సునీత కేజ్రీవాల్
కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్, ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నామినేషన్ వేసేందుకు పరుగులు పెట్టిన నేత.. ఎందుకంటే..?
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతోన్న ఓ అభ్యర్థి పరుగులు పెట్టి మరీ నామినేషన్ వేయాల్సి వచ్చింది. -
‘ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’.. లోక్సభ అభ్యర్థి వ్యాఖ్యలతో షాకైన జనం
Congress candidate: మహిళల కోసం పథకాన్ని ఉద్దేశిస్తూ ఓ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇద్దరు భార్యలుంటే ఏటా రూ.2 లక్షలు తీసుకోవచ్చని ఆయన చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. -
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు!
ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. -
యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్డ్యాన్స్..
ఉత్తర్ప్రదేశ్లో ఓ ర్యాలీలో బుల్డోజర్లు నృత్యం చేశాయి. ఫరూఖాబాద్ లోక్సభ స్థానం అలీగంజ్లో బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. -
రాహుల్ సలహాదారు భారత విభజన గురించి మాట్లాడుతున్నారు
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన ‘వివాదాస్పద’ వ్యాఖ్యలను భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఖండించారు. -
లోక్సభ ఎన్నికలపై మోదీ, రాహుల్ డిబేట్!
లోక్సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీల నడుమ బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎ.పి.షా అభిప్రాయపడ్డారు. -
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాపై ప్రతికూల ప్రభావం!
దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గి, ముస్లింల శాతం పెరిగిందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. -
బూత్ల వారీగా పోలైన ఓట్లు వెబ్సైట్లో ప్రచురించాలి
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన మూడు దశల పోలింగులో బూత్ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ వెబ్సైటులో ప్రచురించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన సివిల్ సర్వెంట్లు డిమాండ్ చేశారు.