icon icon icon
icon icon icon

యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్‌డ్యాన్స్‌..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ర్యాలీలో బుల్డోజర్లు నృత్యం చేశాయి. ఫరూఖాబాద్‌ లోక్‌సభ స్థానం అలీగంజ్‌లో బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

Published : 10 May 2024 06:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ర్యాలీలో బుల్డోజర్లు నృత్యం చేశాయి. ఫరూఖాబాద్‌ లోక్‌సభ స్థానం అలీగంజ్‌లో బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆయన వేదిక వద్దకు రావడానికి ముందే డజన్ల కొద్దీ బుల్డోజర్లను అక్కడికి తీసుకువచ్చారు. ఆ తర్వాత సంగీతానికి అనుగుణంగా.. ఆపరేటర్లు అటూ ఇటూ తిప్పుతూ బుల్డోజర్లతో విన్యాసాలు చేయించారు. కొందరు కార్యకర్తలు వాటిపైకి ఎక్కి నినాదాలు చేశారు. వీటిని 360 డిగ్రీల కోణంలో తిప్పారు. ఇంజిన్‌ వేగాన్ని ఒక్కసారిగా పెంచి.. బ్రేకులు వేయడం వంటివి చేశారు. ఒక దశలో వేదికపై ప్రసంగాల కంటే ప్రజలు ఈ బుల్డోజర్ల పైనే ఆసక్తి చూపడం మొదలుపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img