సిబల్పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతివ్వండి
సుప్రీం కోర్టు తీర్పులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్పై కోర్టు ధిక్కార చర్యలకు చేపట్టేందుకు ఇద్దరు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతినివ్వాల్సిందిగా అటార్నీ జనరల్
అటార్నీ జనరల్కు న్యాయవాదుల విజ్ఞప్తి
దిల్లీ: సుప్రీం కోర్టు తీర్పులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్పై కోర్టు ధిక్కార చర్యలకు చేపట్టేందుకు ఇద్దరు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతినివ్వాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్కు విడివిడిగా లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం సర్వోన్నత న్యాయస్థానంలో క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించడానికి అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సిబల్ తన వ్యాఖ్యల ద్వారా సుప్రీం కోర్టు స్వతంత్రతపై అనుమానాలు వ్యక్తంచేశారని న్యాయవాదులు వినీత్ జిందాల్, శశాంక్ శేఖర్ ఝాలు వేణుగోపాల్కు తెలిపారు. సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్ఠను మసకబార్చాలన్న దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మరోవైపు సిబల్ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ (ఏఐబీఏ) మండిపడింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి