జగన్కు ఊపిరి సలపనివ్వని కడప సిస్టర్స్
ఇలా కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయనకు వారు పక్కలో బల్లెంలా...కాదు..కాదు...గొడ్డలిలా మారారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
పక్కలో బల్లెంలా కాదు.. గొడ్డలిలా మారిన వైనం
ఎదురే లేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్న షర్మిల, సునీత
వివేకా హత్యే ఆయుధంగా ముందుకు
జగన్, ఆయన పరివారాన్ని బాణాల్లా వెంటాడుతున్న వారి ప్రశ్నలు
భారతినే ఇంటింటి ప్రచారానికి పంపిన జగన్
- అయిదు సంక్రాంతులు వెళ్లాయి.... జాబ్ క్యాలెండర్ ఏది?
- సీబీఐ ఛార్జిషీట్లో వైఎస్సార్ పేరును చేర్చింది కాంగ్రెస్ కాదు...జగన్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డే
- జగన్ ఓ ఊసరవెల్లి. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
- గొడ్డలి తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేయాలి. వారు మాత్రమే ఎన్నికల్లో సింగల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి స్ట్రాటజీ?
వైఎస్ షర్మిల
- బ్యాండెజ్ తీయకపోతే సెప్టిక్ అవుతుంది (గులకరాయి గాయంపై)
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
- వివేకా హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి....భారతితో ఫోన్లో ఏం మాట్లాడారు?
డాక్టర్ నర్రెడ్డి సునీత
ఇలా కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయనకు వారు పక్కలో బల్లెంలా...కాదు..కాదు...గొడ్డలిలా మారారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసును ఆయుధంగా మలుచుకుని జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకో అంశాన్ని ఎత్తుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ ఊరూరా, ఇల్లిల్లూ తిరుగుతూ వణుకు పుట్టిస్తున్నారు. 1996 ఎన్నికల్లో వైఎస్ ఎలాగైతే బోటాబొటీ మెజారిటీతో బయటపడ్డారో...ఇప్పుడూ అలాంటి పరిస్థితిని అవినాష్రెడ్డికి వారు తీసుకొస్తున్నారు. ఈ అక్కచెల్ళెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే లేరు. వైఎస్ అవినాష్రెడ్డి అడపాదడపా మాట్లాడుతున్నా...వాటిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్ అవినాష్రెడ్డి ‘చిన్న పిల్లాడు’ అంటూ వెనుకేసుకొచ్చారు. అయినా ఆ మాటలూ పనిచేయడం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఏ ఊరు, ఏ వీధిలోకి వెళ్లి ఏ గడపను అడిగినా వివేకాపై గొడ్డలి వేటు వేసింది ఎవరంటే కథలు కథలుగా చెబుతారు. పులివెందుల పూలంగళ్ల వద్దకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. ‘వివేకాను చంపింది ఎవరో వైఎస్సార్ జిల్లాలో గడప గడపకూ తెలుసు. ఎవర్ని అడిగినా తడబాటు లేకుండానే సమాధానం చెబుతారు. ఇక్కడ అదంతా బహిరంగ రహస్యమే’ అని బద్వేలుకు చెందిన ఓ వైకాపా నాయకుడు చెప్పడమే దీనికి నిదర్శనం.
పోటీలో బలంగా నిలబడిన షర్మిల
షర్మిల, సునీత మాట్లాడుతున్న మాటలు జగన్ను పిడుగుల్లా తాకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకీ వారు తూటాల్లా కౌంటర్ ఇస్తున్నారు. గత ఎన్నికల ముందు పలు హామీలిచ్చి తప్పడంపైనా మాటలతో చీల్చిచెండాడుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ దగ్గర నుంచి గులకరాయి గాయం వరకూ ఏ విషయాన్నీ వారు వదలడం లేదు. బోనులో నిల్చోపెట్టినట్లు నిలదీస్తున్నారు. ఆమె ప్రచారంలో, ప్రెస్మీట్ పెట్టి మాట్లాడే మాటలు జగన్ను, ఆయన పరివారాన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక అవినాష్రెడ్డికి నోట మాట రావడం లేదు. సమర్థించుకునే పరిస్థితి లేదు. ఎదురుదాడి అసలే లేదు. అండగా యంత్రాంగం లేకపోయినా....పార్టీ బలం లేకపోయినా షర్మిలకు తన గళమే బలం. ఇదే ఆమెను పోటీలో బలంగా నిలిపింది. ‘గెలుస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఈ తరహా జగన్కు వణుకుపుట్టించిన వాళ్లు మళ్లీ వైఎస్ కుటుంబం నుంచే వచ్చారు’ అని పులివెందులకు చెందిన ఓ మధ్య వయస్కుడు చెప్పారు.
క్రాస్ ఓటింగ్పై జగన్కు గుబులు....
జగన్కు షర్మిల, సునీత సంధిస్తున్న ప్రశ్నలు నేరుగా ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇది న్యాయానికి, నేరానికీ మధ్య జరుగుతున్న పోరాటమని వారు స్పష్టం చేస్తున్నారు. పులివెందుల పూలంగళ్ల వేదికగా బహిరంగ సభ నిర్వహించి ఇదే విషయాన్ని ప్రజల ముందు ఉంచుతూ కొంగు చాచి ఇద్దరు చెల్లెళ్లూ ఓట్లు అభ్యర్థించారు. ఇది వైఎస్ వివేకా అభిమానుల్లో కదలిక తెచ్చింది. ఆయన ద్వారా లబ్ధిపొందిన వారు జిల్లాలో ఊరూరా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఎన్నికల్లో షర్మిలకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. పులివెందుల పట్టణ పరిధిలో ఎక్కువ మంది మహిళల్లోనూ ఇదే అభిప్రాయముంది. ‘మా ఇంట్లో 5 ఓట్లున్నాయి. మేమంతా షర్మిలకే ఓటేస్తాం’ అని పులివెందులకు చెందిన ఓ యువకుడు చెప్పారు. ఇక్కడే కాదు కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలులో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే జగన్కు గుబులు పుట్టిస్తోంది. సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి షర్మిల వైఎస్సార్ జిల్లాలో రెండో విడత విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈనాడు, అమరావతి
భారతికీ తప్పని నిరసనల బెడద..
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది కడప లోక్సభ నియోజకవర్గమే. ముఖ్యమంత్రి సొంత చెల్లెలే జగన్ మీద విస్తృతమైన ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఆమెకు తండ్రిని కోల్పోయిన బాధితురాలైన సునీత మద్దతుగా నిలుస్తున్నారు. వీరి దెబ్బకి జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆమెకూ ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. మా పాస్పుస్తకంపై జగన్ బొమ్మ ఎందుకంటూ ఓ రైతు ప్రశ్నిస్తే ఆమె నోటి వెంట సమాధానమే లేదు. దానికి జవాబివ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్