Kerala Governor: రాజీనామా చేయండి.. తొమ్మిది మంది వీసీలకు గవర్నర్ ఆదేశం!
కేరళలో విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్ల నియామకం విషయంలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది! తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు.
తిరువనంతపురం: కేరళలో విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్(VC)ల నియామకం విషయంలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్(Arif Mohammed Khan) ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 11.30కల్లా రాజీనామాలు తనకు చేరాలని గవర్నర్ ఆదేశించినట్లు రాజ్భవన్ తెలిపింది.
యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను ఉటంకిస్తూ.. గవర్నర్ తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది వర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని కోరారు. గవర్నర్ తరఫున కేరళ రాజ్భవన్ ఆదివారం ఈ మేరకు ట్వీట్ చేసింది. ఈ తొమ్మిది మంది వీసీల జాబితాలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ వర్సిటీ వీసీ కూడా ఉన్నారు.
కొంతకాలంగా పినరయి విజయన్ సర్కారు, గవర్నర్కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారుపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్కు అడ్డాగా ఉన్న పంజాబ్ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం