India Corona: కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..?

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Published : 11 May 2022 10:19 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 4.72 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,897 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. మరోరోజు 3వేల దిగువనే కేసులొచ్చాయి. 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.24 లక్షల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు. 

24 గంటల వ్యవధిలో 2,986 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా క్రియాశీల కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 19,494కి చేరింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. నిన్న 14.8 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని