ఆక్సిజన్ కొరత: జర్మనీ నుంచి ప్లాంట్ల దిగుమతి!
ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.
వారంలోనే అందుబాటులోకి తేనున్న రక్షణశాఖ
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్లో విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు రాష్ట్రాలు ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్లాంట్ల నుంచి ‘ఎక్స్ప్రెస్’ వేగంతో ఆక్సిజన్ కంటెయినర్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ ఆక్సిజన్ కొరత తీరడం లేదు. దీంతో అప్రమత్తమైన భారత్, ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.
జర్మనీ నుంచి మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను తీసుకువచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు అప్పగించింది. తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్ కేంద్రాల్లో(ఏఎఫ్ఎంఎస్) ఈ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని రక్షణశాఖ వెల్లడించింది. అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొంది. కేవలం వారం రోజుల్లోనే ఈ మొబైల్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అవసరమైన ఆక్సిజన్ కంటెయినర్లను యుద్ధవిమానాల ద్వారా భారత వాయుసేన చేరవేస్తోంది.
ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే, రక్షణశాఖ కార్యదర్శి, డీఆర్డీవో చీఫ్లతో సమీక్ష నిర్వహించిన కేంద్ర రక్షణమంత్రి, వారికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే పలు కంటోన్మెంట్ ఆసుపత్రులను కొవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకురాగా.. రక్షణశాఖ తరపున వైద్య పరికరాలు, సిబ్బంది కొవిడ్ రోగుల సేవల్లో నిమగ్నమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!