cow dung: ‘ఆవుపేడ చికిత్స’ ప్రమాదకరం

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని

Updated : 12 May 2021 10:29 IST

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ముప్పుంది
హెచ్చరించిన గుజరాత్‌ వైద్యులు

అహ్మదాబాద్‌: ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని గుజరాత్‌ వైద్యులు హెచ్చరించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో... ఇక్కడి శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి  ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసేవారు కూడా ఈ చికిత్స పొందుతున్నారు!

దీనిపై గుజరాత్‌ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ‘‘ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకూ పనిచేస్తుందో, దీని ద్వారా కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉంటుంది’’ అని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.దిలీప్‌ మావ్‌లంకర్‌ పేర్కొన్నారు. ‘‘పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా... వైద్యులను సంప్రదించాలి’’ అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ డా.మోనా దేశాయ్‌ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని