భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?
‘సర్దుకుపోవాలమ్మా!’.. పెళ్లయిన కూతురికి ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాట ఇది. అవును.. నేటి తరం ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ అత్తింట్లో
ఇంటర్నెట్డెస్క్: ‘సర్దుకుపోవాలమ్మా!’.. పెళ్లయిన కూతురికి ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాట ఇది. అవును.. నేటి తరం ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ అత్తింట్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సర్దుకుపోవాల్సిందే. అయితే గృహహింస విషయంలోనూ మహిళలు సర్దుకుపోయే ధోరణిలోనే ఆలోచిస్తుండటం బాధాకరం. భార్యను కొట్టడం తమ హక్కు అని భర్తలు భావిస్తుంటే.. మహిళలు కూడా అదే నిజమని నమ్ముతుండటం గమనార్హం. తాజాగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)-5లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
‘‘మీ ఉద్దేశంలో భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? అందుకు ఆయన్ను సమర్థించొచ్చా?’’ అని 18 రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లో ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే నిర్వహించగా.. మెజార్టీ మహిళలు కరెక్టే అని చెప్పారట. అత్యధికంగా తెలంగాణలో 83.8శాతం మంది మహిళలు దీన్ని ఒప్పుకొన్నట్లు సర్వే తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 83.6శాతం, కర్ణాటకలో 76.9శాతం, మణిపూర్లో 65.9శాతం, కేరళలో 52.4శాతం మంది మహిళలు.. భర్తలు కొట్టడంలో తప్పులేదని చెప్పారు. హిమాచల్లో మాత్రం కేవలం 14.8శాతం మహిళలే దీన్ని అంగీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక భార్యలపై ఈ ప్రవర్తనను(కొట్టడం, దాడి చేయడం) సమర్థించుకుంటున్నారా? అని పురుషులను అడగ్గా.. అత్యధికంగా కర్ణాటకలో 81.9శాతం మంది అవునని చెప్పారు.
‘‘భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్లడం.. కుటుంబాన్ని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం.. భర్తతో గొడవపడటం.. శృంగారానికి నిరాకరించడం.. వంట సరిగా చేయకపోవడం, అత్తామామలకు గౌరవం ఇవ్వట్లేద’’నే కారణాలతో భర్త తమను కొడుతున్నారని మెజార్టీ మహిళలు సర్వేలో చెప్పారు. ఇందులో ప్రధానంగా అత్తామామలకు గౌరవం ఇవ్వట్లేదనే కారణంతోనే ఎక్కువ మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని సర్వే పేర్కొంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఐదో ఎడిషన్ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలివిడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను ఇటీవల వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం దేశంలో సంతాన సాఫల్యతా రేటు 2కు పడిపోయిందని తేలింది. ఇక బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల వినియోగంలో మహిళల సంఖ్య పెరిగిందని సర్వే వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం