trillion dollar platinum coin: అమెరికా అచ్చొత్తనున్న రూ.75లక్షల కోట్ల నాణెం..!
అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.75లక్షల కోట్లు. అమెరికా రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్తో ఎదుర్కోవాలని భావిస్తోంది.
రూ.75 లక్షల కోట్ల కాయిన్ దిశగా అడుగులు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.75లక్షల కోట్లు. అమెరికా రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్తో ఎదుర్కోవాలని భావిస్తోంది. దీనిని ముద్రించేందుకు బైడెన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. కానీ, ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అమెరికా కరెన్సీ విలువ దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెట్ సీలింగ్ ఏమిటీ..?
అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనే దానిపై నిబంధనే డెట్సీలింగ్ అంటారు. ఈ సొమ్మును వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీనికి కాంగ్రెస్ అనుమతి ఉండాలి. లేకపోతే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వెచ్చించే మొత్తం ఎక్కువైపోతుంది. 1917లో తొలిసారి దీనిని అమెరికా ప్రవేశపెట్టింది. కానీ, 1960 తర్వాత నుంచి డెట్సీలింగ్ను 78 సార్లు పెంచారు. ప్రస్తుతం 22 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 28.5 మిలియన్ డాలర్లకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ప్లాటినం కాయిన్ ఎందుకు..?
ఈ సారి అక్టోబర్ 18 నాటికి ఆమోదించాల్సిన బడ్జెట్లో అమెరికాకు దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల సొమ్ము తగ్గింది. ఇందుకోసం ట్రిలియన్ డాలర్లు విలువైన ఓ ప్లాటినం కాయిన్ను ముద్రించమని బైడెన్ సర్కారు కోరవచ్చు.
2011లో చేసిన ఓచట్టం అధ్యక్షుడికి ఆ అధికారం ఇచ్చింది. దీని ప్రకారం బంగారం, వెండి, నికెల్,రాగి,కంచు కాకుండా ప్లాటినంతో చేసిన నాణెనికి ఎంత విలువ అయినా ప్రభుత్వం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు మింట్లో ట్రిలియన్ డాలర్ల విలువైన కాయిన్ను ముద్రించే అవకాశం ఉంది.. దానిని ఖజానాలో పెట్టి అమెరికా ప్రభుత్వం మరో ట్రిలియన్ డాలర్లు తీసుకొనే అవకాశం ఉంది.
గతంలో ఎవరైనా చేశారా..?
గతంలో ఒబమా సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 2011లో ఈ విధంగా ప్లాటినం కాయిన్ తయారు చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఒబామానే ‘పాడ్ సేవ్ అమెరికా’ అనే పాడ్ కాస్ట్లో వెల్లడించారు. కాకపోతే ఇది ఒక రాతియుగపు ఆలోచన అని ఆయన అభివర్ణించారు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ అలెన్ మాట్లాడుతూ బైడెన్ ట్రిలియన్ డాలర్ల ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రకమైన పనులు చేసి.. అప్పులను అమెరికా ఎలా చెల్లిస్తుందో ప్రపంచానికి చూపించడం అవసరమా..? అని అలెన్ వ్యాఖ్యనించారు. అంతేకాదు అమెరికన్ ఫెడ్ రిజర్వుపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఈ ట్రిలియన్ డాలర్ల కాయిన్ దెబ్బతీస్తుందన్నారు. అడ్డగోలుగా డబ్బులను అప్పు రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి చొప్పిస్తే.. ఇప్పటికే ఉన్న డబ్బు విలువ కూడా పడిపోతుందనే భయాలు ఉన్నాయి. మరి బైడెన్ సర్కారు అలెన్ మాట ఏ మేరకు వింటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.