IT Raids: కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు.. ₹94కోట్ల నగదు, భారీగా బంగారం సీజ్‌

IT Raids| కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా డబ్బు, బంగారం, వజ్రాభరణాలు సీజ్‌ చేసినట్టు సీబీడీటీ వెల్లడించింది.

Published : 16 Oct 2023 14:52 IST

దిల్లీ: కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ గుత్తేదార్లు, బిల్డర్లు, నగల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో ఆదాయ పన్నుశాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సోమవారం వెల్లడించింది. కర్ణాటక, దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా 55 చోట్ల అక్టోబర్‌ 12 నుంచి కొనసాగించిన ఐటీ దాడుల్లో ₹94 కోట్ల నగదుతో పాటు రూ.8కోట్ల విలువచేసే బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసినట్టు తెలిపింది. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.94 కోట్ల నగదు, బంగారం, వజ్రాభరణాలు సీజ్‌ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు సీజ్‌ చేసిన వస్తువుల విలువ మొత్తంగా రూ.102 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే,  చేతి గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఒక ప్రైవేట్ ఉద్యోగి నివాసంలో 30 విదేశీ రిస్ట్‌ వాచ్‌లను సీజ్‌ చేసినట్టు సీబీడీటీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని