భూమికి చేరిన గ్రహశకల నమూనాలు
సుదూరంలో ఉన్న ఓ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలు ఆదివారం వేకువజామున భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొచ్చిన జపాన్ వ్యోమనౌక హయబుసా-2 విజయవంతంగా ఆ నమూనాలతో కూడిన క్యాప్స్యూల్ను భూ వాతావరణంలోకి జారవిడవగా........
టోక్యో: సుదూరంలో ఉన్న ఓ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలు ఆదివారం వేకువజామున భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొచ్చిన జపాన్ వ్యోమనౌక హయబుసా-2 విజయవంతంగా ఆ నమూనాలతో కూడిన క్యాప్స్యూల్ను భూ వాతావరణంలోకి జారవిడవగా.. అది సురక్షితంగా భూమికి చేరింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనావాసాలు లేని మారుమూల ప్రాంతంలో ఇది ల్యాండ్ అయింది. దాన్ని శాస్త్రవేత్తలు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు ‘జపాన్ ఏరోస్సేస్ ఏజెన్సీ’ వెల్లడించింది.
ఆదివారం క్యాప్సూల్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఊహించినట్లుగానే అది అగ్నిగోళంగా మారింది. అనంతరం పారాచూట్లు విచ్చుకొని వేగం నియంత్రణలోకి వచ్చి సేఫ్ ల్యాండిగ్ జరిగిందని హయబుసా-2 ప్రాజెక్ట్ మేనేజర్ యూషీ సుడా వెల్లడించారు. భూమికి చేరుకున్న రెండు గంటల్లో అది ఎక్కడ ల్యాండ్ అయిందో గుర్తించామని తెలిపారు. అందుకోసం హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టామన్నారు. క్యాప్స్యూల్ను నిర్దిష్టంగా గుర్తించడానికి ఆ ప్రాంతంలో అనేక శాటిలైట్ యాంటెన్నాలు, రాడార్లను జపాన్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ప్రయోగశాలలో పూర్తి స్థాయి సమీక్ష తర్వాత క్యాప్సూల్ను తిరిగి జపాన్ తీసుకెళ్తామని తెలిపారు.
ఈ గ్రహశకల నమూనాలను పరిశోధించడం ద్వారా సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్స్యూల్ను హయబుసా-2 విడిచిపెట్టింది. ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఇందుకు అత్యంత కచ్చితమైన నియంత్రణ చర్యలు అవసరం. వ్యోమనౌక నుంచి విడిపోతున్న దృశ్యాలను వీక్షించడానికి టోక్యోలోని డోమ్ స్టేడియం సహా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
క్యాప్స్యూల్ వెడల్పు 40 సెంటీమీటర్లే. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. తాజాగా క్యాప్స్యూల్ను జారవిడిచిన హయబుసా-2.. 1998కేవై26 అనే గ్రహశకలం దిశగా పయనాన్ని ఆరంభించింది. అక్కడికి చేరుకోవడానికి పదేళ్లు పడుతుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టే విధానాలపై పరిశోధన సాగిస్తుంది. ఇటీవలే అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్ రెక్స్’ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి..
బెన్నుపై నాసా కన్ను!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.