Putin: మోదీ, జిన్పింగ్ బాధ్యత గల నేతలు
భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులని, ఆ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వారికి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు.
భారత్-చైనా సమస్యను వారే పరిష్కరించుకోగలరని పుతిన్ కితాబు
సెయింట్ పీటర్స్బర్గ్: భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులని, ఆ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వారికి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో జరిపిన వర్చువల్ ఇంటరాక్షన్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్, చైనా సంబంధాలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తినట్లు తెలుసు. అయితే పొరుగు దేశాల మధ్య ఇలాంటి విభేదాలు తరచూ వస్తుంటాయి. ఇక, నాకు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి సామర్థ్యం కూడా తెలుసు. వారు చాలా బాధ్యతాయుతమైన నేతలు. వారు పరస్పరం చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఇద్దరూ పరిష్కరించుకోగలరు. ఇందులో ఇతర ప్రాంతీయ శక్తుల జోక్యం ఉండకూడదు’’ అని పుతిన్ అన్నారు. ఇటీవల అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పడటం, ప్రాంతీయంగా గ్రూపింగ్ కావడం గురించి మాస్కో అభిప్రాయం ఏంటని పీటీఐ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాకు భారత్తో, చైనాతో గల సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని పుతిన్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే రష్యా-చైనా మధ్య పెరుగుతున్న సామీప్యత.. ఇండో-రష్యా భద్రత, రక్షణ సహకారంపై ప్రభావం చూపిస్తుందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ జరగదన్నారు. భారత్తో తమకున్న రక్షణ సంబంధాలు పూర్తిగా నమ్మకంపైనే ఆధారపడి ఉన్నాయని, రక్షణ రంగంలో తమకున్న ఏకైక భాగస్వామి కూడా భారతే అని పుతిన్ చెప్పుకొచ్చారు.
ఇటీవల అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ దేశాలుగా ఏర్పడి, మూకుమ్మడిగా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాయి. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకే ఈ దేశాలు గ్రూప్ కట్టాయని డ్రాగన్ ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా కూడా క్వాడ్పై పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరితో స్నేహం పెంచుకుని భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోకూడదని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.