Go First: 50 మందిని వదిలి వెళ్లిన విమానం.. వివరణ కోరిన డీజీసీఏ
ప్రయాణికులను వదిలేసి గో ఫస్ట్ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అయింది. దీనిపై విమర్శలు రాగా..డీజీసీఏ(DGCA) స్పందించింది.
బెంగళూరు: ఏకంగా 50 మంది ప్రయాణికులను వదిలేసి, దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్వేస్(Go First Airways)కు చెందిన విమానం టేకాఫ్ అయిన తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గో ఫస్ట్ను డీజీసీఏ (DGCA) వివరణ కోరింది. రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. సంస్థ ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు ఉండనున్నాయి.
విమాన సేవలపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. బెంగళూరు ఎయిర్పోర్ట్(Bengaluru Airport)నుంచి దిల్లీ(Delhi)కి వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్వేస్(Go First Airways) విమానం ఒకటి.. ఏకంగా 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయింది. ఇదొక భయానక అనుభవమని ప్రయాణికులు ట్వీట్లు చేశారు. ‘ఉదయం 6.20కు విమానం ఉండగా.. 50 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. అయితే.. గంటపాటు అందులోనే ఉంచారు. నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ’ అని ట్విటర్ వేదికగా విమర్శించారు.
సతీశ్ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కేవలం ఒక బస్సులోని ప్రయాణికులే విమానంలో ఎక్కారని, మరో బస్సులోనివారంతా ఇక్కడే ఉండిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు.. విమానయాన సంస్థతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. అయితే, తర్వాత వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
సారీ చెప్పిన గో-ఫస్ట్
ప్రయాణికులను వదిలివెళ్లిన ఘటనపై గో ఫస్ట్ విమానయాన సంస్థ విచార వ్యక్తంచేసింది. కలిగిన అసౌకర్యానికి గానూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అలాగే, అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణికులకు ఉచిత టికెట్ను ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశీయంగా రాబోయే 12 నెలల్లో ఎక్కడికైనా ప్రయాణించేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిని విచారణ పూర్తయ్యే వరకు రోస్టర్ నుంచి తప్పిస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్