Corona: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా..!
విదేశాల నుంచి భారత్కు వస్తోన్న విమానాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. నిన్న ఇటలీ నుంచి పంజాబ్
అమృత్సర్: విదేశాల నుంచి భారత్కు వస్తోన్న విమానాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. నిన్న ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన ఓ విమానంలో 125 మందికి వైరస్ సోకినట్లు తేలిన విషయం తెలిసిందే. తాజాగా అదే దేశం నుంచి వచ్చిన మరో విమానంలోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఇటలీలోని రోమ్ నుంచి ఓ విమానం శుక్రవారం మధ్యాహ్నం అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో 290 మంది ప్రయాణికులున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం.. వీరికి ఎయిర్పోర్టులో కొవిడ్ పరీక్షలు చేయగా.. 173 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో బాధితులను ఐసోలేషన్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నిన్న ఇటలీలోని మిలాన్ నుంచి ఇదే విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా సోకినట్లు తేలింది. ‘ముప్పు ఉన్న’ దేశాల్లో ఒకటిగా ఇటలీని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించిన నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రయాణికులకు పరీక్షలు జరపగా.. పెద్ద ఎత్తున కేసులు బయటపడ్డాయి. వీరికి అమృత్సర్లోని పలు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అయితే అధికారుల కళ్లుగప్పి ఇందులో 13 మంది ప్రయాణికులకు ఐసోలేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. కొవిడ్ నెగెటివ్ వచ్చినప్పటికీ తప్పనిసరిగా ఏడు రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని కేంద్ర హోంశాఖ నేడు ఆదేశించింది. ఎనిమిదో రోజు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని ఆ రిపోర్ట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.