Modi-Jinping: మోదీ-జిన్పింగ్ సంభాషణపై చైనా రాజకీయం.. తిప్పికొట్టిన భారత్
Modi-Jinping: బ్రిక్ సమావేశం సందర్భంగా మోదీ, జిన్పింగ్ కొంతసేపు సంభాషించుకున్నారు. అయితే దిల్లీ అభ్యర్థన మేరకే జిన్పింగ్ మాట్లాడారని చైనా అసత్య ప్రచారానికి దిగింది.
దిల్లీ: దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi i Jinping) కొంతసేపు మాట్లాడుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినా అది జరగలేదు. ఈ క్రమంలోనే చర్చల విషయంలో భారత్ (India)పై చైనా (China) నోరుపారేసుకుంది. దిల్లీ అభ్యర్థన మేరకే బ్రిక్స్ సదస్సులో మోదీ-జిన్పింగ్ సంభాషించుకున్నట్లు ఆరోపించింది. అయితే, చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అసలేం జరిగిందంటే..
మోదీ-జిన్పింగ్ (Modi-Jinping) సంభాషణపై చైనా విదేశాంగ శాఖ శుక్రవారం మాట్లాడుతూ.. ‘‘భారత్ అభ్యర్థన మేరకే బ్రిక్స్ (BRICS) సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు జిన్పింగ్.. మోదీతో ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడారు’’ అని తెలిపారు. కాగా.. చైనా ఆరోపణలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘భారత్తో ద్వైపాక్షిక సమావేశం కోసం చైనానే కోరింది. ఆ అభ్యర్థన పెండింగ్లో ఉంది. అయితే బ్రిక్స్ దేశాల అధినేతల సంయుక్త మీడియా సమావేశం అనంతరం మోదీ, జిన్పింగ్ అనధికారికంగా మాట్లాడుకున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
సరిహద్దుల్లో శాంతి నెలకొల్పుదాం: జిన్పింగ్కు మోదీ స్పష్టీకరణ
గురువారం బ్రిక్స్ సదస్సు వేదిక వద్దకు వెళ్లేటప్పుడూ మోదీ, జిన్పింగ్ మాట్లాడుకున్నారు. మీడియా సమావేశం పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరూ కొంతసేపు క్లుప్తంగా సంభాషించుకున్నారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది నవంబరులో జీ-20 సదస్సు తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం మళ్లీ ఇప్పుడే.
ఇదిలా ఉండగా.. గల్వాన్ లోయలో ఘర్షణలు, తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభనతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇటీవల రెండు దేశాల మధ్య 19వ సారి కార్ప్స్ కమాండ్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ భేటీలో అనేక అంశాలపై ఇరు దేశాల అధికారులు సుదీర్ఘంగా చర్చించారని.. ఇరువైపుల సానుకూల వాతావరణం కనిపించిందని భారత విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్