
Parliament: పెగాసస్పై ప్రత్యేక చర్చ.. ప్రభుత్వం ఏమందంటే..!
పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ప్రహ్లాద్ జోషీ స్పష్టత
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్ వ్యవహారంపై సభలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనంతో మరోసారి తీవ్ర దుమారం రేగడంతో.. ఈ వివాదంపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టం చేశారు. అయినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎటువంటి సమస్యనైనా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తవచ్చని పేర్కొన్నారు.
ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ నిర్వహణపై అఖిలపక్ష భేటీ జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి 25 పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరైనట్లు మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. ప్రభుత్వం తరపున రక్షణశాఖ మంత్రి, లోక్సభలో ఉపనేత రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక పెగాసస్ అంశానికి వస్తే.. ప్రస్తుతం అది న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా ఫిబ్రవరి 12 వరకూ కొనసాగుతాయి. అనంతరం మార్చి 13 నుంచి ఏప్రిల్ 8 వరకు మరో విడతలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇదే సమయంలో 2017లో ఇజ్రాయెల్తో జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసినట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడి కావడంతో ఈ వ్యవహారంపై మరోసారి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Banks: వ్యాపార విస్తరణకు ఫిన్టెక్లతో బ్యాంకుల భాగస్వామ్యం
-
General News
Telangana News: 28నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు: మంత్రి నిరంజన్రెడ్డి
-
Movies News
Manasanamaha: గిన్నిస్ వరల్డ్రికార్డు సాధించిన ‘మనసానమః’
-
Politics News
Agnipath scheme: కేంద్రం ఓ కాపీ క్యాట్.. ఎత్తుకొచ్చిన పథకాలు ఇక్కడ సూట్ కావు: కాంగ్రెస్ ఎంపీ
-
Politics News
Telangana News: సీఎంను ప్రజలే పట్టించుకోవట్లేదు.. భాజపా సైతం పట్టించుకోదు: బండి సంజయ్
-
Movies News
Vivek Oberoi: ‘రక్తచరిత్ర’.. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోను: వివేక్ ఒబెరాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్