ఆరడుగుల దూరంతో అనర్థమే!
గాలిద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను...
గాలి ద్వారా కరోనా.. 4.8 మీటర్ల దూరం వరకు వ్యాప్తి
ప్రస్తుత భౌతిక దూరంతో ఉపయోగం లేదన్న శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: గాలిద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను సవరించాలని సూచిస్తున్నారు. మెడ్రెక్సివ్లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.
ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల దూరం వరకు గాలిద్వారా వైరస్ సంక్రమిస్తుందని పరిశోధకులు తెలిపారు. చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ, మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కొవిడ్-19 సోకుతుందని స్పష్టం చేశారు.
‘ప్రజారోగ్యం ఇప్పుడు మరింత చిక్కుల్లో పడింది. భౌతికదూరం పాటించడం, జన సమ్మర్థ ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం, చేతులు కడుక్కోవడం, ముఖం కవర్ చేసుకోవడంలో మరింత జాగ్రత్త అవసరం. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నప్పుడు రెండు మీటర్లు లేదా ఆరడుగల భౌతికదూరంతో లాభం లేదు. కార్యాలయాల్లో ఆరడుగుల భౌతికదూరం ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. మరింత వ్యాప్తి, వైరస్ ప్రజ్వలన కేంద్రాలకు దారితీస్తుంది’ అని పరిశోధకులు హెచ్చరించారు.
తొలుత ఆస్పత్రుల బయట కరోనా వైరస్ గాల్లో వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖ రాయడంతో వారి వాదనను అంగీకరించింది. అయితే మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్