Parliament: ఆ రెండు రోజులు.. జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం ఉండవు

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు.

Published : 29 Jan 2022 14:04 IST

దిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. దాంతో ఈ రెండు రోజులు  పార్లమెంట్‌లో జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడం లేదని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బులెటిన్ జారీ చేసింది. ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఫిబ్రవరి రెండు నుంచి జీరో అవర్‌లో లేవనెత్తవచ్చని పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ బడ్జెట్‌లో తమ ఆకాంక్షలు ఏమేరకు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఈ సంవత్సరం కూడా బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు మొదటి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశలో ఈ సెషన్‌ను నిర్వహించనున్నారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైరస్ కారణంగా లోక్‌సభ, రాజ్యసభలను షిఫ్ట్‌ల వారీగా నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని