Modi speaks with Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ధన్యవాదాలు..!
ఉక్రెయిన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అధ్యక్షుడు జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు.
తాజా పరిణామాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు
దిల్లీ: ఉక్రెయిన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అధ్యక్షుడు జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు. దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకున్న ఇద్దరు దేశాధినేతలు.. ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు అక్కడి ప్రభుత్వం అందిస్తోన్న సహకారం పట్ల దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న చర్చలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడితో రెండుసార్లు చర్చలు జరిపిన మోదీ.. నేడు మరోసారి ఫోన్లో మాట్లాడనున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు జరుగనున్న సమయంలో ఇరు దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఇప్పటికే రెండుసార్లు మాట్లాడిన మోదీ.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా భారతీయులను తరలించేందుకు వీలుగా ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించాలని కోరారు. ఇరుదేశాల విషయంలో భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తోందని స్పష్టం చేసిన మోదీ, అక్కడనుంచి భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ తొలి కర్తవ్యంగా చెప్పారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన సందర్భంలోనూ భారతీయుల తరలింపుపైనే ప్రధానంగా చర్చించారు. ఇప్పటి వరకు కొనసాగుతోన్న ఆపరేషన్ గంగ కార్యక్రమానికి ఉక్రెయిన్ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, సుమీలో చిక్కుకుపోయిన వారిని తరలించే విషయంలోనూ సహకారం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నేటి సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ మరోసారి మాట్లాడనున్నారు.
ఇదిలాఉంటే, రష్యా-ఉక్రెయిన్ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తోన్న భారత్.. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితిలోనూ ఓటింగ్కు దూరంగా ఉంటోంది. రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పలు తీర్మానాల ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. మరోవైపు ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం ద్వారా ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తీసుకువస్తోన్న భారత్.. ఇప్పటి వరకు 16వేల మందిని స్వదేశానికి సురక్షితంగా చేరవేసింది. సోమవారం రోజున మరో 2వేల మంది భారత్కు చేరుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.