Droupadi murmu: సుపరిపాలన అంటే రామరాజ్యమే: రాష్ట్రపతి
శ్రీరాముడు.. సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు.
దిల్లీ: శ్రీరాముడు.. సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) అన్నారు. అయోధ్యలో సోమవారం రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని ప్రధాని మోదీకి (PM Modi) రాష్ట్రపతి లేఖ రాశారు. 11 రోజులుగా ఎంతో నిష్ఠగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ‘‘మన సంస్కృతి, ఆధ్యాత్మికత, రాముడు జీవితంతో ముడిపడి ఉంది. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తొస్తుంది. సత్యనిష్ఠ గొప్పతనాన్ని రాముడి వల్లే గ్రహించానని గాంధీ అన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు అయోధ్య కార్యక్రమంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది’’ అని లేఖలో పేర్కొన్నారు. పీఎం జన్మన్ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేసిన సంగతిని ముర్ము తన లేఖలో ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్