Kejriwal: సామాన్యుడికి ఆ రెండే పెద్ద ఛాలెంజ్.. ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాలే టార్గెట్!
వచ్చే ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాల కల్పనే ఈరోజు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యమని దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ .....
దిల్లీ: వచ్చే ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాల కల్పనే ఈరోజు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యమని దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014-15లో వార్షిక బడ్జెట్ రూ.31వేల కోట్ల బడ్జెట్ ఉండగా.. ఇప్పుడది రూ.76వేల కోట్లుకు పెరిగిందన్నారు. దిల్లీ బడ్జెట్ దాదాపు 2.5 రెట్లు పెరిగినట్టు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ధరల పెరుగుల, నిరుద్యోగం.. ఈ రెండే సామాన్యుడి ముందున్న అతిపెద్ద సవాళ్లు. దిల్లీ బడ్జెట్ సాహసోపేతమైనది. వినూత్నమైనది. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దిల్లీలో 1.68లక్షల మంది ఉపాధికి అర్హులుగా ఉన్నారు. ఉద్యోగ కల్పనకు టూర్, ట్రావెల్, కన్స్ట్రక్షన్ వంటి ఎనిమిది రంగాలను గుర్తించాం. దిల్లీ షాపింగ్ ఫెస్టివల్ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దాంతో ఉద్యోగాలు కూడా వస్తాయి. దిల్లీ బజార్ పోర్టల్ అన్ని దుకాణాలు, మార్కెట్లను కలుపుతోంది.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది’’ అన్నారు.
‘‘దిల్లీలో 3.75లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు మార్చారు. దిల్లీ ప్రభుత్వం ప్రజలకు అసమానమైన ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. ఉచిత నీటి సరఫరాకు కృషి చేస్తున్నాం. ధరల పెరుగుదల నేపథ్యంలో ఉచిత నీరు, ఉచిత విద్యుత్, ఆరోగ్యం, రవాణా, విద్య కల్పించడం ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తాయి. యమునా నదిని ప్రక్షాళన చేస్తాం.. ఆ పని కొనసాగుతోంది. ఇల్లులేని పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశాం’’
కశ్మీర్ పండింట్లపై భాజపా రాజకీయం
‘‘ఈ 8ఏళ్ల కాలంలో ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్ని అయినా భాజపా కశ్మీర్కు తరలించిందా? ఈ అంశంపై భాజపా రాజకీయం చేస్తోంది. ‘ద కశ్మీర్ఫైల్స్’ చిత్రాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. దీనిద్వారా వచ్చే డబ్బును కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఏకీకరణ బిల్లును ఎన్నికలను ఆలస్యం చేసేందుకే కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లును అధ్యయనం చేస్తాం. అవసరమైతే కోర్టులో ఛాలెంజ్ చేస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం