కేంద్ర మంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కి తరలింపు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌(61) అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కొవిడ్‌ తదనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Published : 01 Jun 2021 23:00 IST

దిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌(61) అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కొవిడ్‌ తదనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు ప్రస్తుతం చికిత్స అందజేస్తోంది. 

గత నెల 21న పోఖ్రియాల్‌ కరోనా బారినపడ్డారు. కొద్దిరోజుల్లోనే కోలుకున్న ఆయన ఇంటి నుంచే వర్చువల్‌గా అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాలతో ఆయన గత కొన్ని రోజులుగా విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని