ఆసుపత్రి నుంచి 860 రెమ్డెసివిర్ వయల్స్ చోరీ
విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రాణాధార మందులకున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే.
భోపాల్: విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రాణాధార మందులకున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెమ్డెసివిర్ వయల్స్ ఇటీవల తీవ్ర కొరత ఏర్పడింది. కొందరు స్వార్థపరులు దీనిని అవకాశంగా మలచుకొని నల్లబజారులో అధిక ధరలకు వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ హమిదియా ఆసుపత్రిలో నిల్వచేసిన 860 రెమ్డెసివిర్ వయల్స్ కనిపించకుండా పోవడం వెనుక ఇలాంటి వారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది. వీటి చోరీ ఎలా జరిగింది, ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇండోర్ నగరంలో రెమ్డెసివిర్ను నల్లబజారులో రూ.22వేలకు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఒకే వ్యక్తి రెండుసార్లు మృతి!
విదిషా: ఎవరికైనా చావు ఒక్కసారే వస్తుందంటారు. మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలోని ఆసుపత్రి మాత్రం ఒకరోజు వ్యవధిలోనే గొరాలాల్ కోరి(58) అనే వ్యక్తి రెండుసార్లు మృతి చెందినట్లు ప్రకటించింది. రైల్వే ఉద్యోగి అయిన గొరాలాల్కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 12న ఏబీవీ వైద్య కళాశాలలో చేర్చారు. ఆ మరుసటి రోజు గొరాలాల్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలపడంతో ఆయన కుమారుడు కైలాష్ ఆసుపత్రి వద్దకు వచ్చారు. అప్పుడు నర్సు ఎదుటపడి మీ నాన్న ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపింది. 14వ తేదీ ఉదయం మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆసుపత్రి సిబ్బంది అందజేయగా తండ్రి మృత దేహాన్ని చూడాల్సిందేనని కైలాష్ సోదరుడు డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది వారిని మార్చురీ వద్దకు తీసుకెళ్లగా ఆ మృతదేహం గొరాలాల్ది కాదని తెలిసింది. వెంటనే సిబ్బంది మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. వార్డులోకి వెళ్లి చూడగా గొరాలాల్ వెంటిలేటర్పై ప్రాణాలతో ఉన్నారు. ఇంటికి తిరిగివెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు ఆ సాయంత్రమే గొరాలాల్ నిజంగానే చనిపోయాడంటూ ఫోన్ వచ్చింది. సిబ్బంది తప్పిదం వల్లే గొరాలాల్ మృతి విషయంలో గందరగోళం ఏర్పడిందని ఆసుపత్రి డీన్ తెలిపారు.
రోగుల ప్రాణాలు తీసిన ఆక్సిజన్ కొరత
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. గోమతీ నగర్లోని లోహియా ఆస్పత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. గోమతీ నగర్లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో కొందరికి స్ట్రెచర్పైనే వైద్యులు ఆక్సిజన్ అమర్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ఆసుపత్రి బ్లాక్లో ఆక్సిజన్ పూర్తిగా అయిపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కొవిడ్ బాధితులు మరణించారు. రాజస్థాన్ పాళీలోని బంగర్ ఆస్పత్రిలో ఇదే తరహా ఘటన జరగ్గా అక్కడ ఓ మహిళ మృతిచెందారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం