ఆపరేషన్ తపోవన్: ఆరో రోజు అదే ఉత్కంఠ!
ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్ తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తపోవన్: ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్ తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సొరంగం నుంచి ఇప్పటికే ఇద్దరిని రక్షించగా, మరో 30మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, వీటికి ప్రతికూల వాతావరణం తీవ్ర అడ్డంకిగా మారింది. ఈ దుర్ఘటన జరిగి ఆరు రోజులు అయినప్పటికీ కార్మికుల ఆచూకీ కోసం భారత ఆర్మీతో పాటు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ముమ్మరం గాలింపు చేపట్టాయి.
అయితే, జోషిమఠ్లో దౌలీగంగలో వరద ప్రవాహం మళ్లీ మొదలు కావడంతో అధికారులు వ్యూహాన్ని మార్చారు. కేవలం బురదను తొలగించడమే కాకుండా మరోచోట సొరంగానికి రంధ్రం చేసి ఎలాగైనా లోనికి ఆక్సిజన్ పంపించాలని నిర్ణయించిన అధికారులు ఆ కోణంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తపోవన్ విద్యుత్కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన వారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఓవైపు పూడికను తొలగించడంతో పాటు మరోవైపు సొరంగ మార్గానికి రంధ్రాలు చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. సంఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా విశ్వాసాన్ని కోల్పోలేదని..అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చివరివరకూ తమ ప్రయత్నం కొనసాగిస్తామని డీజీపీ స్పష్టంచేశారు. అయితే, సొరంగంలో దాదాపు 180 మీటరు ప్రాంతంలో కార్మికులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు, ప్రస్తుతం 114మీటర్ల మేర మట్టిన తీసి లోపలికి ఆక్సిజన్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
పది మృతదేహాలకు అంత్యక్రియలు..
ఉత్తరాఖండ్ దుర్ఘటనలో ఇప్పటి వరకు 36మంది మృతదేహాలను వెలికితీయగా, వీరిలో పదిమందిని గుర్తించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీటికి ఇప్పటికే అంత్యక్రియలు నిర్వహించామని, నిబంధనల ప్రకారం మరో 72గంటల తర్వాత మిగిలిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఘటనలో మరో 169 మంది ఆచూకీ తెలియాల్సి ఉండగా, వీరికోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.
శాస్త్రవేత్తల అధ్యయనం..
హిమాలయ ప్రాంతం నుంచి నదిలోకి ఏ మేరకు నీరు వస్తోందని అంచనా వేసేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం డీఆర్డీఓతో పాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన సాంకేతిక బృందం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించింది. జోషిమఠ్లోని రైనీ గ్రామం సమీపంలో ఉన్న సరస్సుపై ఇప్పటికే పూర్తి సమాచారం ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలనే విషయం తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉంటే, సొరంగంలో చిక్కుకుపోయిన కుటుంబాలు మాత్రం తమవారి ఆచూకి కోసం ధీనంగా ఎదురుచూస్తున్నాయి.
ఇవీ చదవండి..
ఆ పరికరంపైనే ‘అణు’మానాలు
జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.