కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్
కెనడాలో కొందరు భారతీయ విద్యార్థులు గత కొద్దినెలలుగా ఇబ్బందిపడుతున్నారు. దీనిపై కేంద్ర విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు.
ఒట్టావా: కొద్దినెలలుగా కెనడా(canada)లో వందలాదిమంది విద్యార్థులు బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు. దాంతో వారంతా వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెనడా విశ్వవిద్యాలయాల్లో మోసపూరిత అడ్మిషన్ల ద్వారా వీసాలు పొందామని అధికారులు ఆరోపిస్తున్నారని వారు వాపోయారు. ఇటీవల కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ(CBSA) 700 మందికి బహిష్కరణ లేఖలు ఇచ్చింది. విద్యార్థుల అడ్మిషన్ల ఆఫర్ లెటర్లు నకిలీవని గుర్తించిన తర్వాత ఈ లేఖలు జారీ చేసింది.
దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. 2018లో తాము కెనడా(canada) వచ్చామని, కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాతే ఈ నకిలీ అడ్మిషన్ లెటర్ల విషయం వెలుగులోకి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ‘మేం కెనడా వచ్చిన తర్వాత.. మాకు అడ్మిషన్లు లభించిన కళాశాలల్లో సీట్లు భర్తీ అయినట్లు మా ఏజెంట్ చెప్పారు. మరో కళాశాలకు ఈ అడ్మిషన్ను బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. అయితే, ఒక ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఏజెంట్ చెప్పిన మాటకు అంగీకరించాం. మా చదువు పూర్తయింది. కానీ, ఇప్పుడు మాకు బహిష్కరణ లేఖలు పంపారు’ అని ఓ విద్యార్థి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి వల్ల తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, మరికొందరు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రభుత్వం... కెనడా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ‘మేం అమాయకులం. మేం మోసపోయాం. దాదాపు 700 మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు’ అని మరో విద్యార్థి అన్నారు. వీరిలో ఎక్కువమంది పంజాబ్కు చెందినవారే ఉన్నారు.
స్పందించిన విదేశాంగమంత్రి..
ఈ విద్యార్థుల ఆందోళనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) స్పందించారు. వారి సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ శాఖ, హై కమిషన్తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ‘బాధ్యులను శిక్షించాలి. విద్యార్థులు ఏ తప్పు చేయకపోతే, వారికి అన్యాయం జరుగుతుందని, ఈ సమస్యకు వారు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నా. కెనడియన్ వ్యవస్థ ఆ విషయంలో న్యాయంగా ఉంటుందని భావిస్తున్నాను’ అని జై శంకర్(S Jaishankar) వెల్లడించారు. ఈ అంశంపై పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ జై శంకర్కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM