Salman Khan: సల్మాన్ ఖాన్, అమృత ఫడణవీస్లకు వై+ భద్రత
బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్(Salman Khan), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్లకు Y+ గ్రేడ్ భద్రత కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ఖాన్(Salman Khan), అక్షయ్కుమార్లకు భద్రత కల్పించింది. నటుల కుటుంబాలకు పొంచి ఉన్న ప్రమాదంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సల్మాన్కు Y+ గ్రేడ్ భద్రతను కల్పించగా.. అక్షయ్కుమార్కు X కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలో నిందితుడిగా భావిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు వచ్చిన బెదిరింపులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు ప్రస్తుతం ఉన్న ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్లు సల్మాన్కు అనునిత్యం భద్రతగా ఉండనున్నారు. ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తారు.
అలాగే, అక్షయ్ కుమార్కు వై కేటగిరీ భద్రత కింద మూడు షిఫ్ట్లలో ముగ్గురు భద్రతా అధికారులు రక్షణగా ఉండనున్నారు. ఇంకోవైపు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది.
శిందే వర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వై+...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలకు వై+ భద్రతను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త సర్కారు ఏర్పడిన మూడు నెలల తర్వాత కూడా ఈ స్థాయి భద్రతను కొనసాగించడం గమనార్హం. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహావికాస్ అఘాడీ(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి) నాయకులు 25 మందికి ‘కేటగిరైజ్డ్ భద్రత’ను తొలగించింది. అయితే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులకు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులకు కేటాయించిన భద్రతలో మార్పు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.