Supreme Court: యూట్యూబ్ నుంచి పరిహారం కోరుతూ పిటిషన్.. పిటిషనర్కు సుప్రీం ఫైన్!
యూట్యూబ్ (Youtube) ప్రకటనల వల్ల తాను పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించాడు. తనకు పరిహారం ఇప్పించాలని కోరాడు.
దిల్లీ: యూట్యూబ్లో (Youtube) వచ్చే ప్రకటనల వల్ల తన దృష్టి మరలి పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ ఓ పిటిషనర్ సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించాడు. అందుకు ప్రతిగా యూట్యూబ్ నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారంగా (Compensation) ఇప్పించాలని కోరాడు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం సమయాన్ని వృథా చేసినందుకు గానూ జరిమానా (Fine) విధించింది.
యూట్యూబ్లో ప్రకటనల వల్ల తాను పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి సుప్రీకోర్టును ఆశ్రయించాడు. పోటీ పరీక్షల కోసమని తాను యూట్యూబ్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రకటనల్లో భాగంగా వచ్చే సెక్సువల్ కంటెంట్ వల్ల తన ఏకాగ్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నాడు. దీనివల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నానంటూ పిటిషన్ వేశాడు. అలాగే, సోషల్ మీడియాలో నగ్న వీడియోలను నిషేధించాలనీ కోరాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషనర్ల వల్లే న్యాయస్థానాల సమయం వృథా అవుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకవేళ ప్రకటన నచ్చకపోతే వీక్షించడం మానేయాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది.
కేవలం పబ్లిసిటీ కోసం కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు గానూ రూ.1 లక్ష జరిమానాగా చెల్లించాలని కోర్టుకు నేరుగా హాజరైన ఆ వ్యక్తిని ఆదేశించింది. అయితే, తానొక నిరుద్యోగిని వేడుకోవడంతో జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.