UNGA: ఐరాస అసెంబ్లీని సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మార్చొద్దు..
కొవిడ్ డెల్టావేరియంట్ వ్యాప్తి ఎఫెక్ట్ ఐరాస జనరల్అసెంబ్లీ సమావేశాలను కూడా తాకింది. ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన నేతలు
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ డెల్టావేరియంట్ వ్యాప్తి భయం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను కూడా తాకింది. ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన నేతలు న్యూయార్క్కు రాకుండా వీడియో సందేశాలను పంపించాలని అమెరికా కోరింది. ఈ సమావేశం వచ్చేనెల జరగనుంది. ‘అత్యున్నత స్థాయి కార్యక్రమాన్ని సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మార్చవద్దు’ అని కోరింది. ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ 193 సభ్యదేశాలకు ఈ మేరకు లేఖ రాశారు. సభ్యదేశాల ప్రతినిధులు చర్చలో వీడియో మాధ్యమంలో సందేశాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఐరాస ప్రధాన కార్యాలయంలో అమెరికాలో ఉండటంతో వచ్చే అతిథులకు భద్రత, న్యూయార్క్ వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఐరాస సెక్రటేరియట్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు కూడా ఈ కీలకమైన కార్యక్రమాన్ని కరోనా వ్యాప్తికి కారణంగా మారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 21-27 మధ్య జరగనున్నాయి. ఐరాస డేటాబేస్ ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25వ తేదీన ప్రసంగించాల్సి ఉంది. మొత్తం 167 దేశాల ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులు లేదా దౌత్యవేత్తలు ఇందులో వారి సందేశాలను ఇవ్వాల్సి ఉంది. 40 దేశాల నేతలు ఇప్పటికే వీడియో మాధ్యమంలో సందేశం పంపేందుకు పేర్లు నమోదు చేసుకొన్నారు. ఈ జాబితాలో ఇరాన్,ఈజిప్ట్,సౌతాఫ్రికా,నేపాల్ దేశాలు ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాత్రం వ్యక్తిగత స్థాయిలో హాజరై ప్రసంగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.