Road Accidents: డ్రైవర్కు నిద్రమత్తు వదిలించే కళ్లజోడు
నిద్రమత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నప్పుడు అతడిని అలర్ట్ చేసేలా ‘లైఫ్లైన్’ అనే కళ్లజోడును తయారు చేశాడు. ఈ పరికరం పెద్ద శబ్దం చేస్తూ అతని కళ్లకు వైబ్రేషన్ ఇచ్చి మేల్కొలుపుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్మయి తెలిపాడు....
ఇంటర్నెట్డెస్క్: నిద్రమత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నప్పుడు అతడిని అలర్ట్ చేసేలా ‘లైఫ్లైన్’ అనే కళ్లజోడును తయారు చేశాడు. ఈ పరికరం పెద్ద శబ్దం చేస్తూ అతని కళ్లకు వైబ్రేషన్ ఇచ్చి మేల్కొలుపుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్మయి తెలిపాడు. భవిష్యత్లో కళ్లజోడు లేకుండా చిన్నసైజులో లైఫ్లైన్ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రమాదాల కారణంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకమంది గాయాలపాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వాహనాన్ని అదుపు చెయ్యలేక జరిగే ప్రమాదాల సంఖ్యే అధికం. అలా నిద్రమత్తు నుంచి మేల్కొలిపేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని శిశిర గ్రామానికి చెందిన చిన్మయిగౌడ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల జాతీయ రహదారికి సమీపంలో ఉంది.అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండటం గమనించాడు. డ్రైవర్ నిద్రమత్తే అధిక ప్రమాదాలకు కారణమని ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్న చిన్మయి.. దాని కోసం పరిష్కారం వెతకాలనుకున్నాడు. డ్రైవర్ను మేల్కొలిపేలా పరికరం తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో సేకరించాడు. వెంటనే దానికి అవసరమైన ఓ కూలింగ్ గ్లాస్, నానో చిప్, మినీ సౌండ్ బజర్, వైబ్రేటర్, చిన్నసైజు బ్యాటరీని ఆర్డర్ చేశాడు. వీటిని ఉపయోగించి లైఫ్లైన్ అనే కళ్లజోడు రూపొందించాడు.
ఈ కళ్లజోడును వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ పెట్టుకుంటే అతడ్ని అలర్ట్ చేస్తుందని చిన్మయి తెలిపాడు. డ్రైవర్ రెండు సెకెన్లకు మించి కళ్లు మూసుకొని ఉంటే.. వెంటనే పరికరం నుంచి పెద్ద శబ్దం వస్తుందని చెప్పాడు. డ్రైవర్ కళ్లకు సైతం చిన్నపాటి వైబ్రేషన్ ఇస్తుందని, దీంతో వెంటనే వాళ్లు అలర్ట్ అవ్వడానికి వీలుంటుందని వివరించాడు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టే అవకాశం అధికంగా ఉందని చెప్పాడు. కళ్లజోడు వల్ల రాత్రి సమయంలో లైట్ఫోకస్ అధికంగా పడే అవకాశముందని చిన్మయిగౌడ అంటున్నాడు. దానికోసం కళ్లజోడు లేనివిధంగా చిన్నసైజులో ఈ లైఫ్లైన్ పరికరం తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.