ఎవరైనా అలాగే అనుకుంటారు.. అందులో కొత్తేముంది?: సుప్రియా సూలే
మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందినవారే అవుతారంటూ ఇటీవల ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా......
నాగ్పూర్: మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందినవారే అవుతారంటూ ఇటీవల ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఏ నేత అయినా తమ పార్టీకి చెందినవారే సీఎం కావాలని కోరుకుంటారనీ.. అందులో కొత్తేమీలేదన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి అంశంపై ధనుంజయ్ ముండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో దీనిపై సూలే క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘ఏ కార్యకర్తయినా/నేత అయినా/అనుచరులైనా తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఇది సర్వసాధారణం. ఇందులో కొత్తేమీ లేదు’’ అని ఆమె చెప్పారు.
రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కావాల్సింది!
మహారాష్ట్రలో ఈ నెల 10న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అధికార కూటమి 4 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించగా.. ప్రధాన ప్రతిపక్షం భాజపా ఇద్దరిని పోటీలో పెట్టింది. దీంతో ఈ ఎన్నికల్లో బేరసారాలు జరిగే అవకాశాలపై విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘ఇలాంటివి దురదృష్టకరం. ఆరు స్థానాలకు నామినేషన్లు వేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సింది. ఈ ఎన్నికల్లో పోటీలేకుండా ఉండేలా మహావికాస్ అఘాడీ ప్రభుత్వ కూటమికి చెందిన నేతలు కొందరు భాజపా సీనియర్ నేతలను కలిశారు. పోటీ లేకుండా చేసేందుకు ప్రయత్నించారు’’ అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న కొందరు రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు సహకరించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ఊహాగానాలపైనా సుప్రియా సూలే స్పందించారు. అలాంటివి సీరియస్గా పరిగణించాలని.. అధికార కూటమి నేతలు దీనిపై చర్చిస్తారన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేస్తారా?
ప్రస్తుతం జైలులో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు అనిల్ దేశ్ ముఖ్, నవాబ్మాలిక్ ఓటు వేసేందుకు వస్తారా? అని విలేకర్లు ఆమెను ప్రశ్నించగా.. ‘‘ఏ తప్పూ చేయకుండా వాళ్లిద్దరూ జైలులో ఉన్నారు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. వారికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ వారిద్దరికీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు’’ అన్నారు. అలాగే, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతి కేసులో సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే అప్రూవర్గా మారడంపైనా ఆమె స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజే అప్రూవర్గా మారారు. ఎలాంటి ఆరోపణలూ లేని వ్యక్తి (నవాబ్ మాలిక్) ఇంట్లో 109 సార్లు సోదాలు జరిగాయి. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా చూశామా? ఇదో రికార్డు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది’’ అని సూలే మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా