బ్రేకింగ్

breaking
02 May 2024 | 23:26 IST

అదరగొట్టిన హైదరాబాద్‌.. రాజస్థాన్‌పై విజయం

హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (77), యశస్వి జైస్వాల్‌ (67) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 3, నటరాజన్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి (76*), హెడ్‌ (58), క్లాసెన్‌ (42*) చెలరేగి ఆడారు. అవేశ్‌ ఖాన్‌ 2, సందీప్‌ శర్మ 1 వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు