Swiggy: డెలివరీ విమెన్కు రెండురోజుల నెలసరి సెలవులు: స్విగ్గీ
ఆర్థిక స్వేచ్ఛనో లేదా ఇంటి అవసరాలో.. కారణమేదైనా నేడు మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నెలసరి వంటి వ్యక్తిగత
ఇంటర్నెట్డెస్క్: నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో.. చెబితే ఏం అనుకుంటారో అన్న అనుమానం. మహిళలకు ఎదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్ సౌకర్యార్థం మంచి నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా తన బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు.
‘‘నెలసరి సమయంలో బయటకు రావాలన్నా.. రోడ్లపై తిరగాలన్నా మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. డెలివరీని మహిళలు వృత్తిగా ఎంచుకోకపోవడానికి బయటి చెప్పుకోలేని ప్రధాన కారణం ఇది. అలాంటి మహిళలకు అండగా ఉండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. మహిళలు ఒక అడుగు ముందుకేసినప్పుడు.. మనమెందుకు వేయకూడదు. అందుకే మా రెగ్యులర్ డెలివరీ విమెన్కు ప్రతినెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించాం. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఈ సెలవులను వారు ఉపయోగించుకోవచ్చు’’ అని మిహిర్ తెలిపారు.
దీంతో పాటు మహిళా ఉద్యోగుల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రత కోసం వారి పని గంటలను సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేసినట్లు తెలిపారు. రాత్రివేళల్లో తమకు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళలను ఆ సమయంలో డెలివరీ చేయనివ్వబోమని చెప్పారు.
2016 నుంచి స్విగ్గీ డెలివరీల కోసం మహిళలను కూడా విధుల్లోకి తీసుకుంది. తొలి ప్రయత్నంలో పుణెలో ఆరంభించి.. ఆ తర్వాత ఇతర ప్రధాన నగరాల్లోనూ డెలివరీ విమెన్ను తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో నెటిజన్లు స్విగ్గీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.