coronavirus: నిండిపోయిన ఆసుపత్రులు నిలిచిన సర్జరీలు.. జర్మనీలో రికార్డుస్థాయిలో కేసులు
జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది......
బెర్లిన్: జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం 37,120 మంది వైరస్ బారిన పడగా.. బుధవారం ఆ సంఖ్యను మించి కేసులు నమోదయ్యాయి. వారంరోజులుగా అక్కడ ఇన్ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి.. 232.1కి చేరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయకుంటే జర్మనీలో మరోసారి లాక్డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొందని అంటున్నారు.
కఠిన నిర్ణయాలు అవసరం
జర్మనీలో ఆసుపత్రులు, ఐసీయూల్లోకి చేరే కొవిడ్ రోగుల సంఖ్య అధికంగా ఉంది. వైరస్ బాధితులతో ఐసీయూలు నిండిపోయాయని, కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితులు లేవని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. సిబ్బంది మొత్తం కొవిడ్ బాధితులనే పర్యవేక్షిస్తుండటంతో పలు సర్జరీలను నిలిపివేయాల్సి వచ్చిందని బెర్లిన్లోని ఓ చారిటీ ఆసుపత్రి తెలిపింది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు, నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు. వైరస్ ఉద్ధృతిని కట్టడిచేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని పేర్కొంటున్నారు.
టీకా తీసుకోనివారే అధికంగా..
లాక్డౌన్ విధించే అవకాశం లేదని పదేపదే ప్రకటిస్తున్న అధికారులు అందరూ టీకాలు వేసుకోవాలని కోరుతున్నారు. టీకా వేసుకోనివారిలోనే ఎక్కువగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. జర్మనీ జనాభా 8.30 కోట్లు కాగా.. వీరిలో 67 శాతం మంది పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 96,963 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం